మోదీ మాటలకు హర్ట్ అయ్యా: చంద్రబాబు
- July 20, 2018
లోక్సభలో తెదేపా అవిశ్వాస తీర్మానం వీగిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎం స్పందించారు. ''ప్రధాని చాలా చులకనగా మాట్లాడారు. ఆయన మాటలు బాధకలిగించాయి. నేను యూటర్న్ తీసుకున్నానని రాజకీయ ఎదురుదాడి చేశారు. అవిశ్వాసం పెట్టిన వారికి కాదు, ప్రధానికే అహంకారం ఉంది. నాకు, కేసీఆర్కు గొడవలు ఉన్నట్లు మాట్లాడారు. నీతి తప్పారు, ధర్మాన్ని పాటించలేదు. ఆంధ్రప్రదేశ్ భారత్లో భాగమే కాదన్నట్లు మాట్లాడారు. ఏ మాత్రం అన్యాయం జరిగినా ప్రజలు తట్టుకునే పరిస్థితిలో లేరని చెప్పాం. రాష్ట్రానికి న్యాయం చేయాలని అడిగాం. సమస్యలన్నీ నేను సరిచేస్తానని కనీసం 10 నిమిషాలైనా ఎందుకు చెప్పలేకపోయారు? ప్రధాని చులకనగా, చౌకబారుగా మాట్లాడటం బాధకలిగించింది. అన్యాయం జరిగినప్పుడు ఆదుకోవాల్సిన కర్తవ్యం మీది కాదా'' అని చంద్రబాబు ప్రశ్నించారు. కేంద్రంపై ఒక ప్రాంతీయ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అన్ని పార్టీలు కలిసిరావడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







