ముగిసిన బ్రిక్స్ మీడియా ఫోరం సమావేశాలు
- July 20, 2018
కేప్టౌన్ : బ్రిక్స్ మీడియా ఫోరం సమావేశాలు ముగిశాయి. 2018- 19లో మీడియా సహకారాన్ని పెంపొందించేందుకు అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికపై ప్రధాన స్రవంతి లోని మీడియా సంస్థల నేతల మధ్య అంగీకారం కుదిరింది. బ్రిక్స్ను మరింత బలోపేతం చేయడంలో మీడియా పాత్ర, బాధ్యత, బ్రిక్స్ దేశాల్లోని కొత్త మీడియా సంస్థల మధ్య, అలాగే బ్రిక్స్, ఆఫ్రికాల మధ్య మీడియా సహకారాన్ని పెంచడం వంటి అంశాలతో సహా పలు అంశాలపై చర్చలు, పరస్పర అభిప్రాయాల మార్పిడి అనంతరం ఏకాభిప్రాయానికి వచ్చినట్టు కార్యాచరణ ప్రణాళిక పేర్కొంది. ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు, అస్థిరతకు గురిచేసే అంశాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచం పెను మార్పులకు గురవుతోంది. అనేక సద్దుబాట్లు చోటు చేసుకుంటున్నాయి, అభివృద్ధి జరుగుతోంది. కానీ, ఉమ్మడి లక్ష్యంతో కూడిన కమ్యూనిటీని నిర్మించడం మానవాళి అభివృద్ధికి ప్రధాన లక్ష్యంగా మిగిలే వుందని ప్రణాళిక తెలిపింది.
తాజా వార్తలు
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు







