ముగిసిన బ్రిక్స్‌ మీడియా ఫోరం సమావేశాలు

- July 20, 2018 , by Maagulf
ముగిసిన బ్రిక్స్‌ మీడియా ఫోరం సమావేశాలు

కేప్‌టౌన్‌ : బ్రిక్స్‌ మీడియా ఫోరం సమావేశాలు ముగిశాయి. 2018- 19లో మీడియా సహకారాన్ని పెంపొందించేందుకు అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికపై ప్రధాన స్రవంతి లోని మీడియా సంస్థల నేతల మధ్య అంగీకారం కుదిరింది. బ్రిక్స్‌ను మరింత బలోపేతం చేయడంలో మీడియా పాత్ర, బాధ్యత, బ్రిక్స్‌ దేశాల్లోని కొత్త మీడియా సంస్థల మధ్య, అలాగే బ్రిక్స్‌, ఆఫ్రికాల మధ్య మీడియా సహకారాన్ని పెంచడం వంటి అంశాలతో సహా పలు అంశాలపై చర్చలు, పరస్పర అభిప్రాయాల మార్పిడి అనంతరం ఏకాభిప్రాయానికి వచ్చినట్టు కార్యాచరణ ప్రణాళిక పేర్కొంది. ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు, అస్థిరతకు గురిచేసే అంశాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచం పెను మార్పులకు గురవుతోంది. అనేక సద్దుబాట్లు చోటు చేసుకుంటున్నాయి, అభివృద్ధి జరుగుతోంది. కానీ, ఉమ్మడి లక్ష్యంతో కూడిన కమ్యూనిటీని నిర్మించడం మానవాళి అభివృద్ధికి ప్రధాన లక్ష్యంగా మిగిలే వుందని ప్రణాళిక తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com