ఓటు హక్కు కోల్పోయిన షరీఫ్

- July 20, 2018 , by Maagulf
ఓటు హక్కు కోల్పోయిన షరీఫ్

ఇస్లామాబాద్‌: ఈనెల 25న పాకిస్థాన్‌లో జరగనున్న ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌, ఆయన కుమార్తె మరియం, అల్లుడు సఫ్దార్‌ కోల్పోయారు. అవినీతి కేసులో షరీఫ్‌, మరియంలు రావల్పిండిలో జైలుశిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఓటర్ల జాబితాలో ఖైదీల పేర్ల నమోదు గడువు ఈ నెల 5తో ముగిసింది. దీంతో, వీరికి ఓటు వేసే అవకాశం లేకుండా పోయిందని పాక్‌ ఎన్నికల సంఘం ప్రతినిధి నదీమ్‌ ఖాసీం పేర్కొన్నారు. అవెన్‌ ఫీల్డ్‌ కేసులో వీరికి ఈ నెల 6న శిక్ష పడిందని, జులై 5 నాటికే ఓటర్ల జాబితాలో ఖైదీల పేర్ల నమోదు గడువు ముగిసిందని, దీంతో, ఈ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని వారు కోల్పోయారని అన్నారు. ఈ విషయమై పునరాలోచించేందుకు ఏమీ లేదని, ఎన్నికల సంఘం కూడా ఏమీ చేయలేదని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com