రేపు ఆంధ్ర సిఏం ను కలవనున్న తెలంగాణా సిఏం

- December 13, 2015 , by Maagulf
రేపు ఆంధ్ర సిఏం ను కలవనున్న తెలంగాణా సిఏం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును, తెలంగాణ సీఎం కేసీఆర్‌ సోమవారం విజయవాడలో కలవనున్నారు. అయుత చండీ యాగానికి విచ్చేయాల్సిందిగా కేసీఆర్‌ స్వయంగా చంద్రబాబును ఆహ్వానించనున్నారు. ఉదయం 11.30గం.కు హైదరాబాద్‌ బేగంపేట నుంచి కేసీఆర్‌ విజయవాడ వెళ్తారు. చంద్రబాబును ఆహ్వానించిన అనంతరం తిరిగి మధ్యాహ్నం 2.15 గం.కు తిరిగి హైదరాబాద్‌ చేరుకుంటారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్‌ను స్వయంగా చంద్రబాబు ఆహ్వానించారు. అనంతరం కేసీఆర్‌ ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com