శాంతి పునరుద్ధరణకు అంగీకారం

- July 21, 2018 , by Maagulf
శాంతి పునరుద్ధరణకు అంగీకారం

గాజా : గాజా స్ట్రిప్‌లో శాంతిని పునరుద్ధరించేందుకు అటు ఇజ్రాయిల్‌, ఇటు హమాస్‌ అంగీకారాన్ని తెలిపాయని హమాస్‌ ప్రతినిధి ఫవ్జి బర్‌హమ్‌ పత్రికలకు తెలిపారు. ఐక్యరాజ్యసమితి, ఈజిప్టు చేసిన ప్రయత్నాల ఫలితంగానే శాంతి స్థాపనకు రెండింటి మధ్య అంగీకారం కుదిరిందని ఆయన చెప్పారు. ఇజ్రాయిల్‌ బలగాలు జరిపిన దాడిలో డజన్ల సంఖ్యలో పాలస్తీనీయులు మరణించడమే కాకుండా, వేలాది మందికి గాయాలయ్యాయని పాలస్తీనా అధికారులు చెప్పారు. దీనిపై ఇజ్రాయిల్‌ స్పందిస్తూ ఆత్మ రక్షణ కోసం ప్రతిఘటిస్తున్నామని పేర్కొంది. శాంతి పునరుద్దరణకు సంబంధించిన ప్రకటనపై ఇజ్రాయిల్‌ అధికారులు ఎవరూ కూడా తక్షణమే వ్యాఖ్యానించలేదు. కాని సైన్యానికి చెందిన ఒక మహిళా ప్రతినిధి మాట్లాడుతూ శనివారం ఉదయం తెల్లవారు జామున గాజాస్ట్రిప్‌లో ఎటువంటి సైనిక చర్య చోటు చేసుకోలేదన్నారు. గాజాస్ట్రిప్‌ ప్రశాంతంగా ఉందని స్థానికులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com