ఇరు దేశాల సంబంధాలు బలోపేతం
- July 21, 2018
అబుధాబి : ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్ళాలని, అందుకోసం కృషి చేయాలని చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్ (యుఇఎ) నిర్ణయించాయి. ప్రస్తుతం అబూదాబిలో పర్యటిస్తున్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్, యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాని షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, యువ రాజు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్లతో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం ద్వారా వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. విస్తృతమైన రంగాల్లో, ఉన్నత స్థాయిలో సంబంధాల అభివృద్ధికి కృషిని కొనసాగించాలని ఇరుపక్షాల నేతలు భావించారు.
గత 29ఏళ్ళలో చైనా అధ్యక్షుడు యూఏఈలో పర్యటించడం ఇదే మొదటిసారి. అధికార పర్యటనలో భాగంగా అబూదాబి చేరుకున్న జిన్పింగ్కు ఘనస్వాగతం లభించింది. 2015లో బీజింగ్లో యువరాజుతో జరిగిన సమావేశం గురించి జిన్పింగ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ద్వైపాక్షిక స్నేహ సహకారాన్ని పెంపొందించడానికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై ఆనాడు ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. అప్పటి నుండి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సమగ్రమైన, నూతన అభివృద్ధి దశలోకి ప్రవేశించాయని అన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







