ఇరు దేశాల సంబంధాలు బలోపేతం
- July 21, 2018
అబుధాబి : ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్ళాలని, అందుకోసం కృషి చేయాలని చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్ (యుఇఎ) నిర్ణయించాయి. ప్రస్తుతం అబూదాబిలో పర్యటిస్తున్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్, యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాని షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, యువ రాజు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్లతో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం ద్వారా వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. విస్తృతమైన రంగాల్లో, ఉన్నత స్థాయిలో సంబంధాల అభివృద్ధికి కృషిని కొనసాగించాలని ఇరుపక్షాల నేతలు భావించారు.
గత 29ఏళ్ళలో చైనా అధ్యక్షుడు యూఏఈలో పర్యటించడం ఇదే మొదటిసారి. అధికార పర్యటనలో భాగంగా అబూదాబి చేరుకున్న జిన్పింగ్కు ఘనస్వాగతం లభించింది. 2015లో బీజింగ్లో యువరాజుతో జరిగిన సమావేశం గురించి జిన్పింగ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ద్వైపాక్షిక స్నేహ సహకారాన్ని పెంపొందించడానికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై ఆనాడు ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. అప్పటి నుండి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సమగ్రమైన, నూతన అభివృద్ధి దశలోకి ప్రవేశించాయని అన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







