అండర్ గ్రౌండ్లో హనీమూన్.. ఏ జంటకైనా మధురానుభూతే!
- July 22, 2018తేనె ఎంత తీయగా మధురంగా ఉంటుందో.. హానీమూన్ అంతే మధురంగా ఉండాలని నూతన వధూవరులు భావిస్తుంటారు. దంపతులుగా జీవితాన్ని కొనసాగించే జంటకు హనీమూన్ మధురమైన అనుభూతి. హనీమూన్ జ్ఞాపకాలు ఒక జంటకు జీవితాంతం మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.ఈ మధురమైన క్షణాలను అనుభవించడానికి, కొన్ని రోజులపాటు అందమైన, ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్ళి ఉల్లాసంగా గడపడాలనుకుంటారు.
శారీరకంగా మరియు మానసికంగా ఒకటయ్యేందుకు నేల లోపల, 500 అడుగుల లోతులో, విశాలంగా తవ్విన సొరంగాల మధ్య, రెండు అంటే రెండే డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత ఉండే చోట మొదటి ఉల్లాస యాత్రని సెలబ్రెట్ చేసుకుంటే ఎలా ఉంటుంది. ఊహించటానికే చాలా థ్రిలింగ్ అనిపిస్తుంది కదూ! మరి ఇలాంటి ప్లేస్ ఎక్కడ ఉందా అని ఆలోచిస్తున్నారా.. ఇలాంటి చోటు స్వీడిష్ నగరంలో ఉంది.
ప్రపంచంలో భూగర్భంలో లోతైన హోటల్ని స్వీడిష్ నగరం సాలాలో నిర్మించారు. ఈ హోటల్ నిర్మాణం 1908లో పూర్తయింది. ఇది భూమికి 155 మీటర్ల పొడవు, 508 అడుగుల లోతులో ఉంటుంది. ఇది దేశంలో అతిపెద్ద మరియు అతి ముఖ్యమైన వెండి గని. దాన్ని హోటల్గా మార్చేశారు. దీంట్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఒకరోజు విడిది చేయడానికి వీలుగా సౌకర్యాలన్నీ ఉన్నాయి.
నూతన వధూవరులు ఒకరు మీద ఒకరు ప్రేమ చూపించుకోవడానికి.. భూగర్భంలో ఉన్న అనుభూతిని పూర్తిగా పొందాలనుకునేవాళ్లు అక్కడున్న ఏకాంత మందిరాన్ని బుక్ చేసుకోవచ్చు. కేవలం ఇంటర్కామ్ తప్ప బయటి ప్రపంచంతో మరే సంబంధమూ లేని ఈ చోట విడిది చేయడం ఏ జంటకైనా మధురానుభూతే!
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం