అండర్ గ్రౌండ్లో హనీమూన్.. ఏ జంటకైనా మధురానుభూతే!
- July 22, 2018తేనె ఎంత తీయగా మధురంగా ఉంటుందో.. హానీమూన్ అంతే మధురంగా ఉండాలని నూతన వధూవరులు భావిస్తుంటారు. దంపతులుగా జీవితాన్ని కొనసాగించే జంటకు హనీమూన్ మధురమైన అనుభూతి. హనీమూన్ జ్ఞాపకాలు ఒక జంటకు జీవితాంతం మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.ఈ మధురమైన క్షణాలను అనుభవించడానికి, కొన్ని రోజులపాటు అందమైన, ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్ళి ఉల్లాసంగా గడపడాలనుకుంటారు.
శారీరకంగా మరియు మానసికంగా ఒకటయ్యేందుకు నేల లోపల, 500 అడుగుల లోతులో, విశాలంగా తవ్విన సొరంగాల మధ్య, రెండు అంటే రెండే డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత ఉండే చోట మొదటి ఉల్లాస యాత్రని సెలబ్రెట్ చేసుకుంటే ఎలా ఉంటుంది. ఊహించటానికే చాలా థ్రిలింగ్ అనిపిస్తుంది కదూ! మరి ఇలాంటి ప్లేస్ ఎక్కడ ఉందా అని ఆలోచిస్తున్నారా.. ఇలాంటి చోటు స్వీడిష్ నగరంలో ఉంది.
ప్రపంచంలో భూగర్భంలో లోతైన హోటల్ని స్వీడిష్ నగరం సాలాలో నిర్మించారు. ఈ హోటల్ నిర్మాణం 1908లో పూర్తయింది. ఇది భూమికి 155 మీటర్ల పొడవు, 508 అడుగుల లోతులో ఉంటుంది. ఇది దేశంలో అతిపెద్ద మరియు అతి ముఖ్యమైన వెండి గని. దాన్ని హోటల్గా మార్చేశారు. దీంట్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఒకరోజు విడిది చేయడానికి వీలుగా సౌకర్యాలన్నీ ఉన్నాయి.
నూతన వధూవరులు ఒకరు మీద ఒకరు ప్రేమ చూపించుకోవడానికి.. భూగర్భంలో ఉన్న అనుభూతిని పూర్తిగా పొందాలనుకునేవాళ్లు అక్కడున్న ఏకాంత మందిరాన్ని బుక్ చేసుకోవచ్చు. కేవలం ఇంటర్కామ్ తప్ప బయటి ప్రపంచంతో మరే సంబంధమూ లేని ఈ చోట విడిది చేయడం ఏ జంటకైనా మధురానుభూతే!
తాజా వార్తలు
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు