కేటీఆర్‌కు మరో ప్రఖ్యాత ఆహ్వానం

- July 22, 2018 , by Maagulf
కేటీఆర్‌కు మరో ప్రఖ్యాత ఆహ్వానం

హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు మరొక ప్రఖ్యాత ఆహ్వానం లభించింది. అమెరికాలో జరగనున్న " గ్లోబల్ క్లైమెట్ యాక్షన్ సమ్మిట్" సదస్సులో ప్రసంగించాలని కేటీ రామారావుకి ఆహ్వానం అందింది. ఈ మేరకు కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ ఎడ్మండ్ జి బ్రౌన్ మంత్రికి లేఖ రాశారు. సెప్టెంబర్ 12 నుంచి 14 తేదీ వరకు కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొని " ఫ్యూచర్ ఆఫ్ ఎనర్జీ అండ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్" అనే అంశంపైన ప్రసంగించాలని కేటీఆర్‌ గవర్నర్ కోరడం జరిగింది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి హాజరవుతున్న ప్రతినిధులకు వాతావరణ మార్పులకు ప్రభుత్వాలు తీసుకుంటున్న కార్యక్రమాలపై చేసే ప్రసంగం ఉపయుక్తంగా ఉంటుందని గవర్నర్ తెలిపారు.
ఈ ప్రసంగంలో.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం వంటి కార్యక్రమాలతోపాటు భవిష్యత్తు చేపట్టబోయే కార్యక్రమాలను వాతావరణ అనుకూల కార్యక్రమాల పై కూడా వివరించాలని ఆయన లేఖలో కోరారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పు పైన చైతన్యవంతం చేసే దిశగా ఈ సదస్సు ఉంటుంది. ఈ సదస్సు ద్వారా వివిధ ప్రభుత్వాలను, పాలసీ మేకర్స్‌ను సానుకూలంగా ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ సదస్సుకు ప్రపంచంలోని వివిధ ప్రభుత్వాల నుంచి ప్రతినిధులతో పాటు వాతావరణ మార్పులపై పరిశోధనలు చేస్తున్న కీలకమైన వ్యక్తులు హాజరవుతారని మంత్రికి పంపిన ఆహ్వానంలో కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com