అఫ్ఘానిస్థాన్లో ఆత్మాహుతి దాడి.. 11 మంది మృతి
- July 22, 2018
అఫ్ఘానిస్థాన్లోని హమీద్ కర్జాయ్ విమానాశ్రయ సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో విమానాశ్రయ ఎంట్రన్స్ గేటు వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఆత్మాహుతి దాడిలో 11 మంది పౌరులు మృతి చెందారు. మరో 14 మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను భద్రతా దళాలు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దాడికి పాల్పడింది తామే అని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. మొదటి వైస్ ప్రెసిడెంట్ జనరల్ అబ్దుల్ రషీద్ దోస్తుమ్ కాన్వాయ్ వెళ్లిన కొద్దిసేపటికే ఈ దాడి జరిగింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







