అఫ్ఘానిస్థాన్లో ఆత్మాహుతి దాడి.. 11 మంది మృతి
- July 22, 2018
అఫ్ఘానిస్థాన్లోని హమీద్ కర్జాయ్ విమానాశ్రయ సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో విమానాశ్రయ ఎంట్రన్స్ గేటు వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఆత్మాహుతి దాడిలో 11 మంది పౌరులు మృతి చెందారు. మరో 14 మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను భద్రతా దళాలు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దాడికి పాల్పడింది తామే అని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. మొదటి వైస్ ప్రెసిడెంట్ జనరల్ అబ్దుల్ రషీద్ దోస్తుమ్ కాన్వాయ్ వెళ్లిన కొద్దిసేపటికే ఈ దాడి జరిగింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







