ముంబయి అంతటా రాహుల్ గాంధీ,మోడీ హగ్ పోస్టర్లు
- July 22, 2018
అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. లోక్సభలో రాహుల్ గాంధీ అనూహ్యంగా మోడీని ఆలింగనం చేసుకున్న సంఘటనను ఆ పార్టీ ఇప్పుడు ప్రచారాంశంగా మలచుకుంది. రాహుల్ మోడీ హగ్ పోస్టర్లు ముంబయి అంతటా వెలిశాయి, మేము గెలుస్తాం. విద్వేషంతో కాదు...ప్రేమతో... అనే సందేశం కూడా ఈ పోస్టర్లలో చేర్చారు. అంధేరీలోని పార్టీ కార్యాలయం ముందైతే ఏకంగా సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ పేరిటే ఈ పోస్టర్లు ఉండడం విశేషం. బీజేపీ ఎంతగా విద్వేష రాజకీయాలు చేసినా తాము మాత్రం ప్రేమతోనే వారిపై విజయం సాధిస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
మరోవైపు బీజేపీ మాత్రం ఈ పోస్టర్ల స్టంట్ను విమర్శిస్తోంది. వారిలో నిజమైన ప్రేమ భావన లేదు అనడానికి ఈ పోస్టర్లే నిదర్శనమని అంటున్నారు. ప్రచారం కోసమే రాహుల్ మోడీని ఆలింగనం చేసుకున్నారని.. ఈ పోస్టర్లతో రాహుల్ ఉద్దేశం దేశవ్యాప్తంగా తెలిసిపోయిందని.. బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







