ముంబయి అంతటా రాహుల్ గాంధీ,మోడీ హగ్ పోస్టర్లు
- July 22, 2018
అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. లోక్సభలో రాహుల్ గాంధీ అనూహ్యంగా మోడీని ఆలింగనం చేసుకున్న సంఘటనను ఆ పార్టీ ఇప్పుడు ప్రచారాంశంగా మలచుకుంది. రాహుల్ మోడీ హగ్ పోస్టర్లు ముంబయి అంతటా వెలిశాయి, మేము గెలుస్తాం. విద్వేషంతో కాదు...ప్రేమతో... అనే సందేశం కూడా ఈ పోస్టర్లలో చేర్చారు. అంధేరీలోని పార్టీ కార్యాలయం ముందైతే ఏకంగా సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ పేరిటే ఈ పోస్టర్లు ఉండడం విశేషం. బీజేపీ ఎంతగా విద్వేష రాజకీయాలు చేసినా తాము మాత్రం ప్రేమతోనే వారిపై విజయం సాధిస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
మరోవైపు బీజేపీ మాత్రం ఈ పోస్టర్ల స్టంట్ను విమర్శిస్తోంది. వారిలో నిజమైన ప్రేమ భావన లేదు అనడానికి ఈ పోస్టర్లే నిదర్శనమని అంటున్నారు. ప్రచారం కోసమే రాహుల్ మోడీని ఆలింగనం చేసుకున్నారని.. ఈ పోస్టర్లతో రాహుల్ ఉద్దేశం దేశవ్యాప్తంగా తెలిసిపోయిందని.. బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







