ఆమ్నెస్టీ పొందాలనుకునేవారి కోసం 9 కేంద్రాలు
- July 23, 2018
ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్ షిప్, 'ప్రొటెక్ట్ యువర్సెల్ఫ్ బై మాడిఫైయింగ్ యువర్ స్టేటస్' అనే పేరుతో అవగాహనా కార్యక్రమాన్ని ప్రారంభించింది. మూడు నెలల గ్రేస్ పీరియడ్లో ఇల్లీగల్ రెసిడెంట్స్, తమ స్టేటస్ని సరిదిద్దుకుని, ఎలాంటి చట్టపరమైన సమస్యలూ లేకుండా దేశం విడిచిపెట్టి వెళ్ళేందుకు అవకాశం కల్పిస్తున్నారు.ఆమ్నెస్టీ పొందాలనుకునేవారు, యూఏఈలో ఏర్పాటు చేసిన తొమ్మిది కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుంది. అబుదాబీలో రిజిస్ట్రేషన్ సెంటర్ షహామా, అల్ అయిన్, ఘార్బియా తదితర ప్రాంతాల్లోని ఇమ్మిగ్రేషన్స్ సెంటర్స్లోనూ, అలాగే దుబాయ్లో అల్ అవీర్లోనూ రిజిస్ట్రేషన్స్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్ సెంటర్స్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆదివారం నుంచి గురువారం వరకు పనిచేస్తాయి. యూఏఈలో ఇల్లీగల్ రెసిడెన్సీ స్టేటస్ని రెక్టిఫై చేసుకోవడానికి ఆగస్ట్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు అవకాశం కల్పిస్తున్నారు. స్టేటస్ని సరిచేసుకోవడం, లేదంటే దేశం నుంచి బయటకు వెళ్ళిపోవడం వంటి అవకాశాల్ని ఇక్కడ కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనివారిపై చట్టపరమైన చర్యలు తప్పవు
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







