భలే మంచి చౌక బేరము
- July 23, 2018
ఢిల్లీ: భారత విమానయాన సంస్థలు వరుసకట్టి ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా గోఎయిర్ కూడా వినియోగదారుల కోసం ఓ ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. గోఎయిర్ టికెట్ కనీస ధర రూ. 1045గా ప్రకటించింది. జులై 20-జులై23 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది.
ఈ ఆఫర్ కింద బుక్ చేసుకునే ప్రయాణాలు కూడా జులై 21-ఆగస్టు 10మధ్యలోనే ఉండాలి. ఈ సేల్ కింద పరిమిత సీట్లు మాత్రమే ఉన్నాయని గోఎయిర్ ప్రకటించింది.
ఒక వేళ ఈసేల్ కింద ఎంపిక చేసిన సీట్లు అమ్ముడుపోతే ఆ తర్వాత బుక్ చేసుకునే వాటికి సాధారణ ధరలు వర్తిస్తాయని తన వెబ్సైట్ ద్వారా వెల్లడించింది. దీంతోపాటు ఈ నెల మొత్తం పేటీఎంతో బుక్ చేసుకునే ప్రయాణాలపై క్యాష్బ్యాక్ ఆఫర్ కూడా వర్తిస్తుందని తెలిపింది.
ఇతర ఎయిర్లైన్స్ కూడా భారీ ఆఫర్ల ప్రకటన
గోఎయిర్ తోపాటు ఎయిర్ఏషియా, జెట్ఎయిర్వేస్, స్పైస్జెట్ సంస్థలు కూడా భారీ ఆఫర్లను ప్రకటించాయి. ఎయిర్ఏషియా రూ.1339కి ఢిల్లీ, బెంగళూరు, రాంచీ, జైపూర్, కొచ్చి, పుణెలకు టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ జులై 29వరకు అందుబాటులో ఉండనుంది. అక్టోబర్ 31లోపు ప్రయాణాలకే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
జెట్ ఎయిర్వేస్ 30శాతం వరకు డిస్కౌంట్ను ప్రకటించింది. అంతర్జాతీయ, దేశీయ ప్రయాణాల బేస్ ధరపై వర్తిస్తుంది. ఈ ఆఫర్ సోమవారం అర్ధరాత్రితో ముగియనుంది.
కాగా, స్పైస్జెట్ కూడా ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఈరోజు(సోమవారం) హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్లను ఉపయోగించి బుక్ చేసుకుంటే టికెట్పై రూ.1000 తగ్గింపు అందిస్తోంది. ప్రోమోకోడో: HDFC1000 ఉయోగించి ఈరోజు ఈ ఆఫర్ను పొందవచ్చు.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







