గ్రీస్ అడవుల్లో దావానలం

- July 23, 2018 , by Maagulf
గ్రీస్ అడవుల్లో దావానలం

గ్రీస్ దేశ అడవుల్లో చెలరేగిన దావానలం 20 మంది ప్రాణాలను బలి తీసుకున్నది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది పని చేస్తున్నారు. రాజధాని ఏథెన్స్ సమీపంలో వేలాది మంది తమ ఇళ్లను వదిలి వెళ్తున్నారు. ఆచూకీ లేని 10 మంది విదేశీ టూరిస్టుల కోసం రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. దావానలం చాలా భయంకరంగా మారిందని ఫైర్ ఫైటర్లు తెలిపారు. ఏథెన్స్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాతి రిసార్ట్‌లో చాలా మంది బాధితులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అడవి మంటల్లో సుమారు 104 మంది గాయపడ్డారు. ప్రధాని అలెక్సిస్ టిప్రాస్ బోస్నియా పర్యటనను రద్దు చేసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com