27న సంపూర్ణ చంద్రగ్రహణం..బ్లడ్ మూన్ గా చంద్రుడు
- July 24, 2018
వాషింగ్టన్: శతాబ్దపు సుదీర్ఘ చంద్రగ్రహణానికి కౌంట్డౌన్ మొదలైంది. రాబోయే శుక్రవారమే ఈ అరుదైన ఖగోళ వింత చోటు చేసుకోనుంది. ఏకంగా గంటా 45 నిమిషాల పాటు భూమి నీడలోకి చంద్రుడు వెళ్లిపోనున్నాడు. కచ్చితమైన గ్రహణం ఏర్పడినపుడు, అదే సమయంలో సూర్యుడి కిరణాలు పడటం వల్ల చంద్రుడు ఎరుపు రంగులో కనువిందు చేస్తాడు. దీనిని బ్లడ్ మూన్ అంటారు. ఈ నెలలో కనిపించనున్న రెండో ఖగోళ వింత ఇది. ఇప్పటికే 13వ తేదీన పాక్షిక సూర్యగ్రహణం కనిపించింది. 27న సంపూర్ణ చంద్రగ్రహణం, ఆ తర్వాత 31న అరుణ గ్రహం భూమికి దగ్గరగా రానుంది. సంపూర్ణ చంద్రగ్రహణం ఇండియా మొత్తం కనిపిస్తుందని అమెచ్చూర్ ఆస్ట్రోనామర్స్ అసోసియేషన్ ఢిల్లీ సభ్యుడు అజయ్ తల్వార్ చెప్పారు.
అయితే కొన్ని ప్రాంతాల్లో మేఘాలు దట్టంగా ఉండటం వల్ల సరిగా కనిపించకపోయినా.. సుదీర్ఘ గ్రహణం కావడం వల్ల ఎంతోకొంత చూసే అవకాశం మాత్రం దక్కుతుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ప్రతిసారి కచ్చితమైన కక్ష్యలోకి రావడం జరగదు. ఎప్పుడో ఒకసారి ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడు జరగబోయేది అదే అని బ్రాడ్ టక్కర్ అనే ఆస్ట్రోనామర్ చెప్పాడు. యూరప్, ఆఫ్రికా, ఏషియా, ఆస్ట్రేలియా, సౌత్ అమెరికాలలో ఈ సంపూర్ణ సుదీర్ఘ చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. ఇండియాలో శుక్రవారం రాత్రి 11.54 గంటల తర్వాత ఈ గ్రహణం కనిపించడం ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







