పాకిస్తాన్ ఎన్నికల్లో నెగ్గిన తొలి హిందువు
- July 27, 2018
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో జనరల్ కేటగిరీలో విజయం సాధించిన తొలి హిందువుగా మహేష్ కుమార్ మలానీ చరిత్ర సృష్టించాడు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ తరుపున సింధ్ ప్రావిన్స్ లోని థార్ పార్కర్ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగారు. ఏకంగా 14 మందిని వెనక్కు నెట్టి విజేతగా నిలిచాడు. సమీప అభ్యర్థి గ్రాండ్ డెమొక్రటికల్ అలియన్స్కు చెందిన అరబ్ జాకవుల్లాపై గెలుపొందారు. మహేష్ కుమార్ మలానీకి 1,06,630 ఓట్లు రాగా, ప్రత్యర్థికి 87,251 ఓట్లు వచ్చాయి.
మహేశ్ పాకిస్థానీ హిందూ రాజస్థానీ పుష్కర్ణ బ్రహ్మణ కుటుంబానికి చెందినవాడు. 2003-08లో పీపీపీ నుంచి పార్లమెంటు రిజర్వ్డ్ సీటుకు నామినేట్ అయ్యారు. సింధ్ అసెంబ్లీ స్టాండింగ్ కమీటి చైర్ పర్సన్ గా మలానీ సేవలందించారు. 2002 నుంచి రూపొందించిన చట్టం ప్రకారం ముస్లిం మతస్థులు కానివారు కూడా పాకిస్ధాన్ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. పది సీట్లను మైనార్టీల కోసం నేషనల్ అసెంబ్లీలో కేటాయించారు. పార్లమెంట్ లో ఆ పార్టీలకు ఉన్న సీట్ల సంఖ్యను బట్టి కేటాయింపు జరుగుతుంది.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత









