ట్రాన్సిట్ వీసా పై భారత్లోని ఫ్రాన్స్ రాయబారి స్పష్టీకరణ
- July 28, 2018
న్యూఢిల్లీ: భారతీయులు ఇకపై ఫ్రాన్స్లోని ఏ అంతర్జాతీయ విమానాశ్రయంలో అయినా ట్రాన్సిట్ వీసా లేకుండానే భారత పాస్పోర్టు ఉన్న వ్యక్తులు ప్రయాణించేందుకు వీలవుతుంది. ఈనెల 23వ తేదీనుంచి భారతీయ పాస్పోర్టు కలిగి ఉన్న అభ్యర్ధులు ఎయిర్ట్రాన్సిట్ వీసాను పొందనవసరం లేదని, ఫ్రాన్స్లోని ఏ అంతర్జాతీయ విమానాశ్రయానికైనా వెళ్లవచ్చని భారత్లోని ఫ్రాన్స్ రాయబారి అలెగ్జాండర్ జీగ్లర్ వెల్లడించారు. ఎయిర్పోర్టుట్రాన్సిట్ వీసా ఉంటే ప్రయాణీకులు షెంజెన్ ప్రాదేశిక ప్రాంతంలో పర్యటించవచ్చు. అయితే ఈ ప్రాదేశిక ప్రాంతాన్ని దాటి వెళ్లేందుకు వీలులేదు. అయితేహోటల్ వసతి మాత్రమే బయటినుంచి అందుబాటులో ఉంటాయి. ఈ వీసా నిర్దేశించినప్రాంతానికి మించి ఆ ప్రయాణీకుడు వెళ్లేందుకువీలులేదు. రాత్రి మొత్తం బసచేయాలంటే ప్రయాణీకులకు టూరిస్టు వీసా అవసరం అవుతుంది. ఏకీకృత షెంజెన్ వీసా గ్రూప్ కింద చూస్తే రెండురకాలుగా ట్రాన్సిట్ వీసాలున్నాయి. షెంజెన్ సభ్యదేశానికి వెళ్లేవారికి ఇచ్చే వీసా ఒకటి.
అక్కడినుంచి వారు చివరి గమ్యస్థానానికి చేరుకునేందుకు ఒకటి. ఫ్రాన్స్పరంగా మొతతం 26 యూరోపియన్ దేశాలతో కలిసిన ప్రాంతాన్ని షెంజెన్ ప్రాంతంగా రూపొందించింది. ఆదేశాల్లోని సరిహద్దులగుండా వెళ్లేందుకు ఎలాంటి అధికారిక పాస్పోర్టులు అవసరం లేదు. అలాగే ఎలాంటి వీసాలు సైతం అవసరంలేదు.
అదేవిధంగా ఇపుడు ఇతర విదేశీయులకుసైతం యూరోజోన్లోని నిర్దేశించినప్రాంతాలకు ఈ ట్రాన్సిట్ వీసా అవసరం లేకుండానే ప్రయాణించేందుకు వీలు కలుగుతున్నది.
తాజా వార్తలు
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం







