ఈజిప్ట్:75 మందికి మరణశిక్ష
- July 28, 2018ఈజిప్ట్లో 75 మందికి మరణశిక్ష కైరో: ఐదేళ్ల నాటి కేసుకు సంబంధించి 75 మందికి మరణశిక్ష విధిస్తూ ఈజిప్ట్లో ఒక కోర్టు తీర్పు చెప్పింది. వీరిలో నిషిద్ధ 'ముస్లిం బ్రదర్హుడ్' ముఠా అగ్రనేతలు కూడా ఉన్నారు. ఈ తీర్పును ఈజిప్ట్ అత్యున్నత ఆధ్యాత్మిక పీఠం 'గ్రాండ్ ముఫ్తి'కి కోర్టు నివేదిస్తుంది. సాధారణంగా కోర్టు నిర్ణయానికి అక్కడ సమ్మతి లభిస్తుంటుంది. ఈ కేసులో మరో 660 మందికి సెప్టెంబర్ 8న శిక్ష ఖరారు చేయనున్నారు. 2013లో నాటి అధ్యక్షుడు మహ్మద్ మోర్సి పాలనకు వ్యతిరేకంగా భారీ నిరసనలు జరిగాయి. దీంతో సైన్యం ఆయనను పదవీచ్యుతుడిని చేసింది. ఈ నేపథ్యంలో మోర్సి మద్దతుదారులు ధర్నాకు దిగారు. ఇది హింసాత్మకంగా మారింది. భద్రతా దళాలు వీరిని చెదరగొట్టాయి. ఇందులో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు శిక్ష పడింది.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక