ఈజిప్ట్:75 మందికి మరణశిక్ష
- July 28, 2018
ఈజిప్ట్లో 75 మందికి మరణశిక్ష కైరో: ఐదేళ్ల నాటి కేసుకు సంబంధించి 75 మందికి మరణశిక్ష విధిస్తూ ఈజిప్ట్లో ఒక కోర్టు తీర్పు చెప్పింది. వీరిలో నిషిద్ధ 'ముస్లిం బ్రదర్హుడ్' ముఠా అగ్రనేతలు కూడా ఉన్నారు. ఈ తీర్పును ఈజిప్ట్ అత్యున్నత ఆధ్యాత్మిక పీఠం 'గ్రాండ్ ముఫ్తి'కి కోర్టు నివేదిస్తుంది. సాధారణంగా కోర్టు నిర్ణయానికి అక్కడ సమ్మతి లభిస్తుంటుంది. ఈ కేసులో మరో 660 మందికి సెప్టెంబర్ 8న శిక్ష ఖరారు చేయనున్నారు. 2013లో నాటి అధ్యక్షుడు మహ్మద్ మోర్సి పాలనకు వ్యతిరేకంగా భారీ నిరసనలు జరిగాయి. దీంతో సైన్యం ఆయనను పదవీచ్యుతుడిని చేసింది. ఈ నేపథ్యంలో మోర్సి మద్దతుదారులు ధర్నాకు దిగారు. ఇది హింసాత్మకంగా మారింది. భద్రతా దళాలు వీరిని చెదరగొట్టాయి. ఇందులో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు శిక్ష పడింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







