బహ్రెయినీ ఎలక్ట్రోలర్ బ్యాటిల్లో 17 మంది మహిళలు
- July 30, 2018
రానున్న పార్లమెంటరీ ఎన్నికల కోసం ఇప్పటిదాకా 17 మంది మహిళలు తాము బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. నవంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం వుంది. మహిళా పార్లమెంటేరియన్లకు సుప్రీం కౌన్సిల్ ఫర్ విమెన్ నేతృత్వంలోని అఫీషియల్ అలాగే సివిల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి మంచి మద్దతు లభిస్తోంది. 2010 నుంచి 2014 వరకు కౌన్సిల్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్కి పనిచేసిన మాజీ పార్లమెంటేరియన్ ఎబ్తిస్సామ్ హెజ్రెస్ మరోసారి ఈ ఏడాది కూడా బరిలో నిలుస్తున్నారు. మరో మాజీ ఎంపీ రువా అల్ హేకి కూడా రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. సదరన్ గవర్నరేట్ నుంచి ఆమె ప్రాతినిథ్యం వహిస్తారు. గతంలో ఆమె నార్త్ గవర్నరేట్లోని ఏడవ నియోజకవర్గం నుంచి పనిచేశారు. క్యాపిటల్ గవర్నరేట్ పరిధి నుంచి అత్యధికంగా ఆరుగురు అభ్యర్థులు నిలబడుతున్నారు. వీరందరికీ ప్రొఫెషనల్ బ్యాక్ గ్రౌండ్ బలమని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







