రామోజీ ఫిలింసిటీలో 'సాహో' యాక్షన్
- July 30, 2018
ప్రభాస్ యాక్షన్ ప్యాక్ 'సాహో'. రూ. 300కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం ఇప్పటికే ప్రభాస్ గల్ఫ్ దేశాలు చుట్టొచ్చారు. అక్కడ రూ.90 కోట్ల వ్యయంతో యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేకంగా వేసిన మార్కెట్ సెట్ లో జరుగుతోంది. ఇక్కడ హీరోయిన్ శ్రద్ధాకపూర్తోపాటు, మరికొద్దిమంది నటులు పాల్గొంటున్నారు. దీని తర్వాత ఒకట్రెండు యాక్షన్ సీన్స్ ని కూడా తెరకెక్కిస్తారట. 40రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది.
'బాహుబలి' తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాకావడంతో 'సాహో'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే భారీతనంతో తెరకెక్కుస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ బాషల్లో సినిమాని విడుదల చేయనున్నారు. నీల్ నితిన్ ముఖేష్, ఎవ్లీన్ శర్మ, లాల్, అరుణ్ విజయ్, మందిరాబేడి, జాకీ ష్రాఫ్, వెన్నెల కిషోర్, మహేష్ మంజ్రేకర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శంకర్ - ఎహసాన్ - లాయ్. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







