భారతీయ వలసదారుడి మృతి
- July 31, 2018
కేరళకు చెందిన ఓ వ్యక్తి అబుదాబీలో మృతిచెందారు. రెండు నెలలుగా అతని ఆచూకీ దొరకలేదని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. జూన్ 19న సముద్రంలో మృతదేహాన్ని కనుగొన్నారు. మృతుడ్ని మొయిదీన్న్గా గుర్తించారు. మార్చి నెలలో మొయిదీన్ ఉద్యోగం కోల్పోయారనీ, ముస్సాఫాలోని ఓ వర్క్ షాప్లో అప్పటిదాకా పనిచేశారనీ, మార్చిలో ఆ కంపెనీ మూతపడిందనీ అతని సన్నిహితులు పేర్కొన్నారు. మొయిదీన్ నుంచి కొంతకాలంగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో బంధువులు ఆందోళన చెందారు. రమదాన్ సందర్భంలో మొయిదీన్తో మాట్లాడినట్లు మృతుడి బంధువు చెప్పారు. మొయిదీన్కి సంబంధించిన సమాచారం కోసం కొన్ని వారాలుగా ప్రయత్నిస్తున్న తాను, సోషల్ మీడియాలో తనకు తెలిసిన వివరాల్ని ప్రచారం చేశాననీ, వీలైనంత త్వరగా మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు ప్రయత్నిస్తామని సోషల్ వర్కర్ ఎంఎం నాజర్ కహన్గాద్ చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!







