భారతీయ వలసదారుడి మృతి
- July 31, 2018
కేరళకు చెందిన ఓ వ్యక్తి అబుదాబీలో మృతిచెందారు. రెండు నెలలుగా అతని ఆచూకీ దొరకలేదని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. జూన్ 19న సముద్రంలో మృతదేహాన్ని కనుగొన్నారు. మృతుడ్ని మొయిదీన్న్గా గుర్తించారు. మార్చి నెలలో మొయిదీన్ ఉద్యోగం కోల్పోయారనీ, ముస్సాఫాలోని ఓ వర్క్ షాప్లో అప్పటిదాకా పనిచేశారనీ, మార్చిలో ఆ కంపెనీ మూతపడిందనీ అతని సన్నిహితులు పేర్కొన్నారు. మొయిదీన్ నుంచి కొంతకాలంగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో బంధువులు ఆందోళన చెందారు. రమదాన్ సందర్భంలో మొయిదీన్తో మాట్లాడినట్లు మృతుడి బంధువు చెప్పారు. మొయిదీన్కి సంబంధించిన సమాచారం కోసం కొన్ని వారాలుగా ప్రయత్నిస్తున్న తాను, సోషల్ మీడియాలో తనకు తెలిసిన వివరాల్ని ప్రచారం చేశాననీ, వీలైనంత త్వరగా మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు ప్రయత్నిస్తామని సోషల్ వర్కర్ ఎంఎం నాజర్ కహన్గాద్ చెప్పారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







