భారతీయ వలసదారుడి మృతి
- July 31, 2018
కేరళకు చెందిన ఓ వ్యక్తి అబుదాబీలో మృతిచెందారు. రెండు నెలలుగా అతని ఆచూకీ దొరకలేదని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. జూన్ 19న సముద్రంలో మృతదేహాన్ని కనుగొన్నారు. మృతుడ్ని మొయిదీన్న్గా గుర్తించారు. మార్చి నెలలో మొయిదీన్ ఉద్యోగం కోల్పోయారనీ, ముస్సాఫాలోని ఓ వర్క్ షాప్లో అప్పటిదాకా పనిచేశారనీ, మార్చిలో ఆ కంపెనీ మూతపడిందనీ అతని సన్నిహితులు పేర్కొన్నారు. మొయిదీన్ నుంచి కొంతకాలంగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో బంధువులు ఆందోళన చెందారు. రమదాన్ సందర్భంలో మొయిదీన్తో మాట్లాడినట్లు మృతుడి బంధువు చెప్పారు. మొయిదీన్కి సంబంధించిన సమాచారం కోసం కొన్ని వారాలుగా ప్రయత్నిస్తున్న తాను, సోషల్ మీడియాలో తనకు తెలిసిన వివరాల్ని ప్రచారం చేశాననీ, వీలైనంత త్వరగా మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు ప్రయత్నిస్తామని సోషల్ వర్కర్ ఎంఎం నాజర్ కహన్గాద్ చెప్పారు.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







