సైరా సెట్ ని కూల్చేసిన రెవిన్యూ అధికారులు
- August 01, 2018
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న సైరా కోసం వేసిన సెట్ ను మున్పిపల్ అధికారులు కూల్చివేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమా కోసం శేరిలింగంపల్లి రెవిన్యూ పరిధిలో వేశారు. ఆ సెట్స్లోనే సైరా మూవీ షూటింగ్ జరుపుతున్నారు. అయితే ఇది ప్రభుత్వ భూమి కావడంతో చిత్ర నిర్మాతలు ఎలాంటి అనుమతి తీసుకోకుండా యదేచ్చగా షూటింగ్ జరుపుతున్న క్రమంలో రెవిన్యూ అధికారులు సైరాలో కథానాయకుడి ఇంటి సెట్ని కూల్చేశారు. గతంలో పలు మార్లు ఆ స్థలాన్ని ఖాళీ చేయమని నోటీసులు పంపిన ఫలితం లేకపోవడంతో ఇలా చేయాల్సి వచ్చిందని అధికారులు అంటున్నారు. ముందస్తు పర్మీషన్ తీసుకుంటే ఉచితంగానే షూటింగ్ చేసుకోనిచ్చేవారమని, కాని వారు అనుమతుల్లేకుండా సెట్స్ వేశారని, అందుకని సెట్స్ మొత్తాన్ని కూల్చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!







