సైరా సెట్ ని కూల్చేసిన రెవిన్యూ అధికారులు
- August 01, 2018
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న సైరా కోసం వేసిన సెట్ ను మున్పిపల్ అధికారులు కూల్చివేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమా కోసం శేరిలింగంపల్లి రెవిన్యూ పరిధిలో వేశారు. ఆ సెట్స్లోనే సైరా మూవీ షూటింగ్ జరుపుతున్నారు. అయితే ఇది ప్రభుత్వ భూమి కావడంతో చిత్ర నిర్మాతలు ఎలాంటి అనుమతి తీసుకోకుండా యదేచ్చగా షూటింగ్ జరుపుతున్న క్రమంలో రెవిన్యూ అధికారులు సైరాలో కథానాయకుడి ఇంటి సెట్ని కూల్చేశారు. గతంలో పలు మార్లు ఆ స్థలాన్ని ఖాళీ చేయమని నోటీసులు పంపిన ఫలితం లేకపోవడంతో ఇలా చేయాల్సి వచ్చిందని అధికారులు అంటున్నారు. ముందస్తు పర్మీషన్ తీసుకుంటే ఉచితంగానే షూటింగ్ చేసుకోనిచ్చేవారమని, కాని వారు అనుమతుల్లేకుండా సెట్స్ వేశారని, అందుకని సెట్స్ మొత్తాన్ని కూల్చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ







