పారిస్:ఈఫిల్ టవర్ సందర్శన విధానంపై విమర్శలు

- August 01, 2018 , by Maagulf
పారిస్:ఈఫిల్ టవర్ సందర్శన విధానంపై విమర్శలు

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈఫిల్ టవర్ వద్ద జనం బారులు తీరుతున్నారు. దీంతో ఎంట్రీ కోసం కొత్త విధానాన్ని అమలు చేశారు. అయితే ఆ విధానం వల్ల పర్యాటకులు భారీగా క్యూ కట్టాల్సి వస్తోంది. ఇది సిబ్బందికి కూడా తలనొప్పిగా మారింది. దీంతో కొత్త యాక్సెస్ విధానానికి నిరసనగా బుధవారం ఈఫిల్ టవర్ సిబ్బంది బంద్ పాటించారు. దీంతో వేల సంఖ్యలో టూరిస్టులు అనేక గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది. ఏ రకమైన టికెట్ తీసుకున్నా టవర్ వద్ద ఉన్న ఎలివేటర్లను అందరూ ఎక్కేలా చర్యలు తీసుకోవాలని స్టాఫ్ డిమాండ్ చేస్తోంది. ఈఫిల్ టవర్ నిర్వహణ కోసం మొత్తం 300 మంది పనిచేస్తుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com