త్వరలో ‘బాహుబలి’ ప్రీక్వెల్
- August 02, 2018
భారతీయ సినిమా గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది బాహుబలి.. భారతీయ సినిమా రికార్డ్స్ అన్నిటినీ బ్రేక్ చేసేసింది.ఈ సినిమాతో విశ్వవ్యాప్తంగా తెలుగు సినిమా జండాను రెపరెపలాడించాడు దర్శకుడు రాజమౌళి. ఇప్పుడు ఇదే కోవలో మరో ‘బాహుబలి’ రాబోతోంది. అయితే ఇది సీక్వెల్ కాదు.. ప్రీక్వెల్. ఈ మేరకు వెబ్ సిరీస్ ప్లాన్ చేసింది నెట్ ఫ్లిక్స్.
అయితే ఇందులో కేవలం శివగామి జీవితాన్ని, మాహిష్మతి రాజ్యాన్ని మాత్రమే ఆవిష్కరించబోతున్నారు. ప్రముఖ రైటర్ ఆనంద్ నీలకంఠన్ రాసిన ‘రైజ్ అఫ్ శివగామి’ బుక్ ఆధారంగా ఈ ఫ్రీక్వెల్ తెరకెక్కుతుంది. బాహుబలిని నిర్మించిన రాజమౌళి నిర్మాతలుగా వ్యవహరించిన ఆర్కామీడియా కూడా ఇందులో పాలుపంచుకుంటోంది. ఈ సిరీస్ కు దర్శకులు దేవా కట్టా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు. మొదటి సీజన్ లో తొమ్మిది ఎపిసోడ్ లు ఉంటాయి. ఇందులో శివగామి చిన్నప్పటి జీవితం ఆమె ధైర్యసాహసాలు వంటి ఘటనలు ఉంటాయి.
కాగా ఈ ఫ్రీక్వెల్ కు సంబంధించి బాహుబలి దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. నెట్ ఫ్లిక్స్ నిర్ణయం భారతీయ ప్రాచీన కథను ప్రపంచానికి చాటిచెబుతోందని.ఈ విషయంలో చాలా సంతోషంగా ఉందని అన్నారు. చిత్ర నిర్మాత ప్రసాద్ దేవినేని, మాట్లాడుతూ.. ఈ ఫ్రీక్వెల్ ఒరిజినల్ సిరీస్ డెవలప్ చెయ్యడానికి ఏడాదికి పైగా నెట్ ఫ్లిక్స్ తో పనిచేస్తున్నట్టు అయన తెలిపారు. ఇదిలావుంటే సాకార్డ్ గేమ్స్ తరువాత ‘నెట్ ఫ్లిక్స్’ బాహుబలి ఫ్రీక్వెల్ నే నిర్మించడం గమనార్హం.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









