సిమెంట్ ట్రక్కి ప్రమాదం: డ్రైవర్ సురక్షితం
- August 02, 2018
యూ.ఏ.ఈ:కాంక్రీట్ మిక్సర్ ట్రక్ ఓ రోడ్డు ప్రమాదంలో బోల్తా పడగా, డ్రైవర్ సురక్షితంగా బయటపడిన ఘటన అజ్మన్లో చోటు చేసుకుంది. ప్రమాద సమాచారం అందుకోగానే అజ్మన్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంబులెన్స్ టీమ్స్, సివిల్ డిఫెన్స్ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మెటల్ కటింగ్ ఎక్విప్మెంట్, క్రేన్స్ వినియోగించి ప్రమాదంలో ఇరుక్కున్న ట్రక్ నుంచి డ్రైవర్ని వెలుపలకి తీసుకొచ్చారు. స్వల్ప గాయాలతో డ్రైవర్ బయటపడ్డాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అజ్మన్ సివిల్ డిఫెన్స్ అధికారి మేజర్ మర్వాన్ యూసుఫ్ అల్ షామ్షి మాట్లాడుతూ, వాహనదారులు తగిన వేగంతో వాహనాల్ని నడపాలనీ, ప్రమాదాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలనీ, అతి వేగంతో వాహనాలు నడపకూడదని సూచించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!







