సిమెంట్ ట్రక్కి ప్రమాదం: డ్రైవర్ సురక్షితం
- August 02, 2018
యూ.ఏ.ఈ:కాంక్రీట్ మిక్సర్ ట్రక్ ఓ రోడ్డు ప్రమాదంలో బోల్తా పడగా, డ్రైవర్ సురక్షితంగా బయటపడిన ఘటన అజ్మన్లో చోటు చేసుకుంది. ప్రమాద సమాచారం అందుకోగానే అజ్మన్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంబులెన్స్ టీమ్స్, సివిల్ డిఫెన్స్ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మెటల్ కటింగ్ ఎక్విప్మెంట్, క్రేన్స్ వినియోగించి ప్రమాదంలో ఇరుక్కున్న ట్రక్ నుంచి డ్రైవర్ని వెలుపలకి తీసుకొచ్చారు. స్వల్ప గాయాలతో డ్రైవర్ బయటపడ్డాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అజ్మన్ సివిల్ డిఫెన్స్ అధికారి మేజర్ మర్వాన్ యూసుఫ్ అల్ షామ్షి మాట్లాడుతూ, వాహనదారులు తగిన వేగంతో వాహనాల్ని నడపాలనీ, ప్రమాదాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలనీ, అతి వేగంతో వాహనాలు నడపకూడదని సూచించారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







