సిమెంట్ ట్రక్కి ప్రమాదం: డ్రైవర్ సురక్షితం
- August 02, 2018యూ.ఏ.ఈ:కాంక్రీట్ మిక్సర్ ట్రక్ ఓ రోడ్డు ప్రమాదంలో బోల్తా పడగా, డ్రైవర్ సురక్షితంగా బయటపడిన ఘటన అజ్మన్లో చోటు చేసుకుంది. ప్రమాద సమాచారం అందుకోగానే అజ్మన్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంబులెన్స్ టీమ్స్, సివిల్ డిఫెన్స్ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మెటల్ కటింగ్ ఎక్విప్మెంట్, క్రేన్స్ వినియోగించి ప్రమాదంలో ఇరుక్కున్న ట్రక్ నుంచి డ్రైవర్ని వెలుపలకి తీసుకొచ్చారు. స్వల్ప గాయాలతో డ్రైవర్ బయటపడ్డాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అజ్మన్ సివిల్ డిఫెన్స్ అధికారి మేజర్ మర్వాన్ యూసుఫ్ అల్ షామ్షి మాట్లాడుతూ, వాహనదారులు తగిన వేగంతో వాహనాల్ని నడపాలనీ, ప్రమాదాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలనీ, అతి వేగంతో వాహనాలు నడపకూడదని సూచించారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!