హైదరాబాద్ లో రాత్రి ఒంటిగంట వరకు బార్లు..
- August 03, 2018
హైదరాబాద్:రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి, ఖజానా నింపుకోవడానికి ఇంతకంటే మార్గం కనిపించడం లేదు. బార్ల యజమానులు కూడా మరీ అర్థరాత్రి 12 గంటల వరకే అంటే ఎలా ఇంకో గంట పెంచితే మీకూ ఆదాయం, మాకు ఆదాయం అంటూ ప్రభుత్వానికి ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. అయితే ఈ శుభవార్త అన్ని నగరాలకు కాదు. ఒక్క హైదరాబాద్ వాసులకు మాత్రమే. GHMCతో పాటు ఐదు కిలోమీటర్ల పరిధిలోని బార్లకు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం (ఆగస్టు 2) ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం ఉదయం 10 నుంచి రాత్రి 12 వరకు తెరిచి ఉంచే బార్లను మరో గంట పొడిగించి మందుబాబుల్ని మద్యం మత్తులో జోగమంటున్నారు. ఈ సువర్ణావకాశం శుక్ర,శని వారాల్లో మాత్రమే అంటోంది ఎక్సైజ్ శాఖ. వీకెండ్స్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని బార్ల యజమానులు మరో గంట పెంచాలంటూ కోరడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాగి డ్రైవ్ చేయకండి..ఇంకొకరి ప్రాణాలు బలి తీసుకోకండి.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







