హైదరాబాద్ లో రాత్రి ఒంటిగంట వరకు బార్లు..
- August 03, 2018
హైదరాబాద్:రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి, ఖజానా నింపుకోవడానికి ఇంతకంటే మార్గం కనిపించడం లేదు. బార్ల యజమానులు కూడా మరీ అర్థరాత్రి 12 గంటల వరకే అంటే ఎలా ఇంకో గంట పెంచితే మీకూ ఆదాయం, మాకు ఆదాయం అంటూ ప్రభుత్వానికి ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. అయితే ఈ శుభవార్త అన్ని నగరాలకు కాదు. ఒక్క హైదరాబాద్ వాసులకు మాత్రమే. GHMCతో పాటు ఐదు కిలోమీటర్ల పరిధిలోని బార్లకు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం (ఆగస్టు 2) ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం ఉదయం 10 నుంచి రాత్రి 12 వరకు తెరిచి ఉంచే బార్లను మరో గంట పొడిగించి మందుబాబుల్ని మద్యం మత్తులో జోగమంటున్నారు. ఈ సువర్ణావకాశం శుక్ర,శని వారాల్లో మాత్రమే అంటోంది ఎక్సైజ్ శాఖ. వీకెండ్స్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని బార్ల యజమానులు మరో గంట పెంచాలంటూ కోరడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాగి డ్రైవ్ చేయకండి..ఇంకొకరి ప్రాణాలు బలి తీసుకోకండి.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







