హైదరాబాద్ లో రాత్రి ఒంటిగంట వరకు బార్లు..
- August 03, 2018హైదరాబాద్:రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి, ఖజానా నింపుకోవడానికి ఇంతకంటే మార్గం కనిపించడం లేదు. బార్ల యజమానులు కూడా మరీ అర్థరాత్రి 12 గంటల వరకే అంటే ఎలా ఇంకో గంట పెంచితే మీకూ ఆదాయం, మాకు ఆదాయం అంటూ ప్రభుత్వానికి ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. అయితే ఈ శుభవార్త అన్ని నగరాలకు కాదు. ఒక్క హైదరాబాద్ వాసులకు మాత్రమే. GHMCతో పాటు ఐదు కిలోమీటర్ల పరిధిలోని బార్లకు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం (ఆగస్టు 2) ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం ఉదయం 10 నుంచి రాత్రి 12 వరకు తెరిచి ఉంచే బార్లను మరో గంట పొడిగించి మందుబాబుల్ని మద్యం మత్తులో జోగమంటున్నారు. ఈ సువర్ణావకాశం శుక్ర,శని వారాల్లో మాత్రమే అంటోంది ఎక్సైజ్ శాఖ. వీకెండ్స్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని బార్ల యజమానులు మరో గంట పెంచాలంటూ కోరడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాగి డ్రైవ్ చేయకండి..ఇంకొకరి ప్రాణాలు బలి తీసుకోకండి.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!