రోజుకు ఐదంటే ఐదు చాలు...
- August 03, 2018
ద్రాక్ష పండ్లను ఇష్టపడని వారుండరు. అయితే, పచ్చి ద్రాక్షలో కంటే ఎండు ద్రాక్షలోనే పోషకాలు పుష్కలంగా ఉంటాయని న్యూట్రిషనిస్టులు చెపుతున్నారు. అందుకే రోజుకు 5 ఎండు ద్రాక్షలను తింటే చాలని వారు అంటున్నారు. దీనికి కారణం ఈ ఎండు ద్రాక్షలో ఐరన్, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉండటమేకాకుండా, సహజసిద్ధంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని అంటున్నారు. ఈ ఎండు ద్రాక్ష ఆరగిస్తే కలిగే లాభాలను ఓసారి పరిశీలిద్ధాం.
* ఇందులో ఉండే ఫైబర్ వల్ల ఉదర సంబంధిత సమస్యలు దరిచేరవు. ప్రతిరోజు రాత్రి ఒక గ్లాసు పాలు, 10 ఎండు ద్రాక్షలు తీసుకోవడం వల్ల ఉదర సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
* పొటాషియం నరాలు, కండరాలు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది.
* ఎండు ద్రాక్షలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ప్రతి రోజూ ఓ కప్పు నీటిలో 10 నుంచి 15 ఎండు ద్రాక్షలను నానబెట్టాలి. దీనిలో కొద్దిగా నిమ్మరసం కలపాలి. 4 - 5 గంటల తర్వాత ఎండు ద్రాక్షను నమలాలి. ఇలాక్రమం తప్పకుండా చేస్తే అనీమియా వ్యాధి దూరమవుతుంది.
* ఎండు ద్రాక్షలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి పళ్లను, చిగుళ్లను దృఢంగా ఉండేలా చేస్తాయి.
* యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల కేన్సర్ కారక కణాలను నాశనం చేస్తాయి.
* ఎండు ద్రాక్షను క్రమం తప్పకుండా ఆరగించడం వల్ల ఇందులోని క్యాల్షియం కీళ్ల నొప్పులను మటుమాయం చేస్తుంది.
* అన్నిటికంటే ముఖ్యంగా, ప్రతిరోజు ఎండు ద్రాక్షను తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పోతాయి. కాలేయ సంబంధ సమస్యలను నివారిస్తుంది.
* ఎండు ద్రాక్షలో బీటా కెరోటిన్, విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇవి కంటి చూపును మెరుగుపడటానికి సాయపడతాయి.
* పిల్లల శరీరానికి ఎండుద్రాక్ష సహజమైన వేడిని అందిస్తుంది. దీనివల్ల పిల్లలు రాత్రిపూట పక్కలో మూత్రవిసర్జన చేయరు.
* ఎండు ద్రాక్షలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







