దుబాయ్ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం
- August 03, 2018దుబాయ్లోని అల్ బర్షాలో గల ఓ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఆపరేషన్ రూమ్కి మధ్యాహ్నం 11.42 నిమిషాల సమయంలో ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందడంతో, వెంటనే ఫైర్ ఇంజిన్స్ని సంఘటనా స్థలానికి తరలించారు. అల్ మర్సా సివిల్ డిఫెన్స్ నుంచి వీటిని సంఘటనా స్థలానికి పంపించడం జరిగింది. ఓ రెస్టారెంట్లోని ఎయిర్ కండిషన్ ద్వారా మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. వెంటనే మంటల్ని ఆర్పివేయడం జరిగింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు పేర్కొన్నారు. స్థానికుడొకరు ఈ ఘటనను వీడియో రూపంలో సోషల్ మీడియాలో పొందుపర్చారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు