బస్‌ ఓవర్‌ టర్న్‌ ఆరుగురికి గాయాలు

- August 06, 2018 , by Maagulf
బస్‌ ఓవర్‌ టర్న్‌ ఆరుగురికి గాయాలు

అబుదాబీలోని ఐసిఎడి క్యాంప్‌ బ్రిడ్జి వద్ద బస్‌ ఓవర్‌ టర్న్‌ కావడంతో ఆరుగురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో 14 మంది కార్మికులు ఆ బస్సులో ఉన్నారు. అబుదాబీ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, బస్సు వెనుక టైరు పేలడంతో అదుపు తప్పి, ఓవర్‌ టర్న్‌ అయినట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అబుదాబీలోని ముఫ్రాక్‌ ఆసుపత్రిలో వారికి చికిత్స అందుతోంది. అబుదాబీ ట్రాఫిక్‌ అండ్‌ పెట్రోల్స్‌ డైరెక్టరేట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ &ఙ్రబిగగేషడియర్‌ జనరల్‌ అహ్మద్‌ అబ్దుల్లా అల్‌ షెహ్మి మాట్లాడుతూ, వాహనదారులు తమ టైర్లను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, చిన్న చిన్న పగుళ్ళు వుంటే తక్షణం తగు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రమాదాల్ని నివారించుకోవచ్చని చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com