బస్ ఓవర్ టర్న్ ఆరుగురికి గాయాలు
- August 06, 2018
అబుదాబీలోని ఐసిఎడి క్యాంప్ బ్రిడ్జి వద్ద బస్ ఓవర్ టర్న్ కావడంతో ఆరుగురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో 14 మంది కార్మికులు ఆ బస్సులో ఉన్నారు. అబుదాబీ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, బస్సు వెనుక టైరు పేలడంతో అదుపు తప్పి, ఓవర్ టర్న్ అయినట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అబుదాబీలోని ముఫ్రాక్ ఆసుపత్రిలో వారికి చికిత్స అందుతోంది. అబుదాబీ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ &ఙ్రబిగగేషడియర్ జనరల్ అహ్మద్ అబ్దుల్లా అల్ షెహ్మి మాట్లాడుతూ, వాహనదారులు తమ టైర్లను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, చిన్న చిన్న పగుళ్ళు వుంటే తక్షణం తగు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రమాదాల్ని నివారించుకోవచ్చని చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







