బహ్రెయిన్లో ఇమామ్ దారుణ హత్య
- August 06, 2018మాస్క్లో సీనియర్ ఇమామ్గా పనిచేస్తున్న వ్యక్తిని అతి కిరాతకంగా చంపేసిన ఘటన బహ్రెయిన్లో వెలుగు చూసింది. బంగ్లాదేశీ వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడ్ని అబ్దుల్జలీల్ హమూద్గా గుర్తించారు. ప్రార్థనల అనంతరం అబ్దుల్జలీల్ ఆచూకీ కన్పించకుండా పోయింది. దాంతో బంధువులు, అబ్దుల్ జలీల్ ఆచూకీ కోసైం పోలీసుల్ని సంప్రదించారు. ఈ కేసు విషయమై స్పందించిన ఇంటీరియర్ మినిస్ట్రీ, ఇమామ్ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, అల్ మజ్రా ఏరియాలోని స్క్రాప్ యార్డ్ దగ్గర దుండగులు పారేసినట్లు ప్రకటించింది. ఆసియాకి చెందిన 35 ఏళ్ళ వ్యక్తిని పోలీసులు ఈ కేసులో నిందితుడిగా భావించి అరెస్ట్ చేశారు. నిందితుడు మాస్క్లో రిసైటర్గా పనిచేస్తున్నాడనీ, అదే మాస్క్లో అబ్దుల్ అజీజ్ ఇమామ్గా పనిచేస్తున్నాడని తెలుస్తోంది. ఉచిత వీసాలు ట్రేడ్ చేస్తుండడంతో నిందితుడ్ని ఇమామ్ హెచ్చరించినట్లు, ఆ కారణంగానే ఈ హత్య జరిగిందనీ పోలీసులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







