డార్జిలింగ్ షూటింగ్ పూర్తి చేసిన తలైవా
- August 07, 2018
కబాలి , కాలా చిత్రాలతో అభిమానులను , ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసిన సూపర్ స్టార్ రజనీకాంత్..ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా డార్జిలింగ్ షెడ్యూల్ పూర్తి చేసినట్లు సమాచారం. సుమారు 25 రోజుల పాటు చిత్ర యూనిట్ డార్జిలింగ్ లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ నేతృత్వం లో ఈ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారట.
ఇక ఈ మూవీ లో ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి , బాబీ సింహ వంటి ప్రముఖ నటులు నటిస్తుండగా , సీనియర్ సౌత్ హీరోయిన్ సిమ్రాన్ తో పాటు బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకరాబోతున్నారు. త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలని రజనీ భావిస్తున్నాడు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







