కరుణానిధి అంత్యక్రియలపై తొలగిన అడ్డంకి
- August 07, 2018
కరుణానిధి అంత్యక్రియలపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగింది. మెరీనా తీరంలో ఖననం చేసేందుకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని మద్రాసు హైకోర్టు తెలిపింది. డీఎంకే స్థాపకుడు అన్నాదురై సమాధి దగ్గరే కరుణానిధిని ఖననం చేసేందుకు అనుమతించాల్సిందిగా స్టాలిన్ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో న్యాయపరమైన చిక్కులు వస్తాయని ప్రభుత్వం మెరినాతీరంలో అనుమతి ఇవ్వలేదు. కరుణానిధికి స్థలం కేటాయించడానికి తీర ప్రాంత నియంత్రణ మండలి నిబంధనలు అడ్డుగా ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి ప్రత్యామ్నాయంగానే కరుణానిధి అంతిమ సంస్కారాలకు గిండిలో 2ఎకరాలను కేటాయించినట్లు వెల్లడించింది. డీఎంకే పార్టీ మద్రాసు హైకోర్టులో అత్యవసర పిటిషన్ను దాఖలు చేసింది. ఉదయం విచారణ సందర్భంగా ప్రభుత్వం, డీఎంకే తరపున న్యాయవాదులు వాదప్రతివాదనలు వినిపించారు. తీరప్రాంత నిబంధనల వల్లే బీచ్లో స్థలం కేటాయించలేకపోతున్నామని అంతేకాకుండా సీఎం పదవిలో ఉండగా చనిపోతేనే మెరీనా బీచ్లో స్థలం కేటాయిస్తారని ప్రభుత్వం తెలిపింది. అన్ని పక్షాల వాదనలు విన్న మద్రాసు హైకోర్టు మెరీనా తీరంలో ఖననం చేసేందుకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని తెల్చి చెప్పింది. దీంతో కరుణానిధి అంత్యక్రియలపై అడ్డంకి తొలగినైట్లెంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









