షార్జాలో పెళ్ళయిన రెండు రోజులకే వధువు మృతి
- August 09, 2018షార్జాలో ఓ మహిళ పెళ్ళయిన రెండు రోజులకే రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ ప్రమాదంలో భర్తకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అతనికి వైద్య చికిత్స అందుతోంది. అల్ కాసిమి హాస్పిటల్లో వైద్య చికిత్స అందుతోంది. మల్టిపుల్ ఫ్రాక్చర్స్తో వరుడు బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. సోమవారం ఈ ప్రమాదం జరిగింది. పాతికేళ్ళ వధువు హుయామ్, తన భర్త మొహ్మద్ అబ్దుల్లా అల్ జలాఫ్ తో కలిసి అల్ బయ్యాలోని కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షార్జాకి తిరిగి వస్తున్న క్రమంలో ఎమిరేట్స్ రోడ్డు పై ప్రమాదం జరిగినట్లు వైద్యులు తెలిపారు. డ్రైవింగ్ చేస్తున్న వరుడు, ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడి, ఓ ట్రక్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ