ఈద్‌ సందర్భంగా ప్రైవేటు కంపెనీల ముందస్తు జీతాల చెల్లింపులు

- August 09, 2018 , by Maagulf
ఈద్‌ సందర్భంగా ప్రైవేటు కంపెనీల ముందస్తు జీతాల చెల్లింపులు

మస్కట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ మేన్‌ పవర్‌, ఒమన్‌లోని ప్రైవేటు కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాల్ని ముందస్తుగా చెల్లించాలని ఆదేశించింది. ఆగస్ట్‌ 19లోపు ఉద్యోగులకు ప్రైవేటు కంపెనీలు జీతాలు చెల్లించాల్సి వుంటుంది. మినిస్టర్‌ ఆఫ్‌ మేన్‌ పవర్‌ అబ్దుల్లా అల్‌ బక్రి ఆదేశాల మేరకు కంపెనీలు ఉద్యోగులకు ముందస్తుగా వేతనాలు చెల్లించేందుకు సిద్ధమయ్యాయి. ఈద్‌ అల్‌ అదా సందర్భంగా ఆగస్ట్‌ నెల జీతాల్ని ఆగస్ట్‌ 19వ తేదీ లోపు చెల్లించాలని మినిస్ట్రీ జారీ చేసిన ప్రకటనను అధికారులు ఉటంకిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com