మనామా:లిక్కర్ స్మగ్లర్స్ అప్పీల్ని తిరస్కరించిన న్యాయస్థానం
- August 10, 2018
మనామా:200,000 బహ్రెయినీ దినార్స్ విలువైన ఆల్కహాల్ని స్మగ్లింగ్ చేసిన కేసులో 14 మందికి జైలు శిక్ష విధించగా, వారి అప్పీల్ని న్యాయస్థానం తాజాగా తిరస్కరించింది. నిందితులంతా ఆసియా జాతీయులే. వీరికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అనంతరం వారిని దేశం నుంచి బహిష్కరిస్తారు. ఈ కేసుకి సంబంధించి మొత్తం 21 మంది అనుమానితులపై కేసులు నమోదయ్యాయి. వీరిలో ఏడుగురికి మూడు నెలల జైలు శిక్ష పడగా, వీరెవరూ తమ శిక్షను అప్పీల్ చేయడానికి ముందుకు రాలేదు. షిప్లో అక్రమంగా మద్యం బాటిళ్ళను దాచి, బహ్రెయిన్లోకి స్మగుల్ చేస్తుండగా నిందితుల్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి 200,000 బహ్రెయినీ దినార్స్ విలువైన మద్యంతోపాటుగా, 36,000 బహ్రెయినీ దినార్స్ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







