కోరిక తీర్చడం ఎంతో ఆనందం...
- December 15, 2015
అజిత్సింగ్నగర్ క్యాన్సర్ బాధితురాలైన తన అభిమాని కోరిక తీర్చేందుకు సినీనటుడు అల్లు అర్జున్ మంగళవారం విజయవాడలోని అజిత్సింగ్నగర్ విచ్చేసారు. దీంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. తమ అభిమాన హీరో వస్తున్నాడని తెలిసి యువకులందరూ అల్లు అర్జున్ను చూసేందుకు తరలివచ్చారు. అల్లు అర్జున్కు అభిమానులు పూలతో ఘన స్వాగతం పలికారు. మస్తాన్బీ అనారోగ్యానికి సంబంధించిన వివరాలు తెలుసుకొని, భయపడవద్దని భరోసా కల్పించారు. కొద్ది సేపు ఆమె కుటుంబంతో గడిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... క్యాన్సర్తో బాధపడుతున్న షేక్ మస్తాన్బీ గురించి ఓ టీవీ ఛానెల్లో వచ్చిన కథనాన్ని చూసి పరామర్శించేందుకు వచ్చినట్లు తెలిపారు. తమ కుటుంబాన్ని ఇంతగా అభిమానించే అభిమానుల కోరిక తీర్చడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







