కోరిక తీర్చడం ఎంతో ఆనందం...
- December 15, 2015
అజిత్సింగ్నగర్ క్యాన్సర్ బాధితురాలైన తన అభిమాని కోరిక తీర్చేందుకు సినీనటుడు అల్లు అర్జున్ మంగళవారం విజయవాడలోని అజిత్సింగ్నగర్ విచ్చేసారు. దీంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. తమ అభిమాన హీరో వస్తున్నాడని తెలిసి యువకులందరూ అల్లు అర్జున్ను చూసేందుకు తరలివచ్చారు. అల్లు అర్జున్కు అభిమానులు పూలతో ఘన స్వాగతం పలికారు. మస్తాన్బీ అనారోగ్యానికి సంబంధించిన వివరాలు తెలుసుకొని, భయపడవద్దని భరోసా కల్పించారు. కొద్ది సేపు ఆమె కుటుంబంతో గడిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... క్యాన్సర్తో బాధపడుతున్న షేక్ మస్తాన్బీ గురించి ఓ టీవీ ఛానెల్లో వచ్చిన కథనాన్ని చూసి పరామర్శించేందుకు వచ్చినట్లు తెలిపారు. తమ కుటుంబాన్ని ఇంతగా అభిమానించే అభిమానుల కోరిక తీర్చడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







