కోరిక తీర్చడం ఎంతో ఆనందం...
- December 15, 2015
అజిత్సింగ్నగర్ క్యాన్సర్ బాధితురాలైన తన అభిమాని కోరిక తీర్చేందుకు సినీనటుడు అల్లు అర్జున్ మంగళవారం విజయవాడలోని అజిత్సింగ్నగర్ విచ్చేసారు. దీంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. తమ అభిమాన హీరో వస్తున్నాడని తెలిసి యువకులందరూ అల్లు అర్జున్ను చూసేందుకు తరలివచ్చారు. అల్లు అర్జున్కు అభిమానులు పూలతో ఘన స్వాగతం పలికారు. మస్తాన్బీ అనారోగ్యానికి సంబంధించిన వివరాలు తెలుసుకొని, భయపడవద్దని భరోసా కల్పించారు. కొద్ది సేపు ఆమె కుటుంబంతో గడిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... క్యాన్సర్తో బాధపడుతున్న షేక్ మస్తాన్బీ గురించి ఓ టీవీ ఛానెల్లో వచ్చిన కథనాన్ని చూసి పరామర్శించేందుకు వచ్చినట్లు తెలిపారు. తమ కుటుంబాన్ని ఇంతగా అభిమానించే అభిమానుల కోరిక తీర్చడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









