ఇండియా:తొలి మహిళా కమాండో టీమ్ సిద్ధం
- August 11, 2018
భారత దేశపు తొలి మహిళా టీమ్ స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (స్వాట్-SWAT) శుక్రవారం ఏర్పాటైంది. పూర్తి మహిళా కమాండో స్క్వాడ్లతో కూడిన మొదటి స్వాట్ టీమ్ ఇదే కావడం విశేషం. 36 మందితో కూడిన ఈ బృందం 15 నెలల పాటు భారత ఆర్మీ, ఇజ్రాయిల్ భద్రతాదళం వద్ద ప్రత్యేక శిక్షణ పొంది.. సేవలందించేందుకు సిద్దమైంది. ఈ బృందంలో ఉన్న మహిళలందరూ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారు కాగా.. తీవ్రవాదుల ఊహకందని రీతిలో దాడులను తిప్పికొట్టడం ఈ టీమ్ ప్రత్యేకత.
యుద్ధవిన్యాసాలతో పాటు ఆయుధాల నిర్వహణ వంటి టెక్నిక్స్లలో ఈ టీమ్ సభ్యులు ఆరితేరారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ), లాంగ్వేజ్ సంబంధించిన శిక్షణ కూడా తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సేవలందిస్తున్న ఐదు కమాండో టీమ్లతో కలిసి ఈ మహిళా టీమ్ కూడా సేవలందిస్తుందని సీనియర్ ఢిల్లీ పోలీస్ అధికారి ప్రమోద్ కుష్వాహా తెలిపారు.
పంద్రాగస్టున స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ సందేశం ఇస్తుండగా.. ఈ కొత్త షీ టీమ్ భద్రతను పర్యవేక్షిస్తుంది. ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు కేంద్రం స్వాట్ టీమ్ను నియమించింది. దేశ రాజధానితో పాటు ప్రధాని మోదీకి భద్రతగా హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ బృందాన్ని ఢిల్లీ పోలీసు శాఖలో నియమించారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







