వాడి దర్బాత్‌లో నీట మునిగి ఇద్దరు మృతి

- August 11, 2018 , by Maagulf
వాడి దర్బాత్‌లో నీట మునిగి ఇద్దరు మృతి

మస్కట్‌:వాడి డర్బాత్‌లో ఇద్దరు పౌరులు నీట మునిగి మృతి చెందినట్లు పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ (పిఎసిడిఎ) వెల్లడించింది. వాడి నుంచి ఇద్దరు పౌరుల్ని ప్రాణాలతో రక్షించినప్పటికీ, వారిని బతికించలేకపోయినట్లు పిఎసిడిఎ పేర్కొంది. వాడి దర్బాత్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్‌ టీమ్‌ ఎంతగా ప్రయత్నించినా వారిని రక్షించలేకపోయింది. విహార యాత్రల కోసం వెళ్ళేవారు, నీటిలోకి దిగేటప్పుడు అప్రమత్తంగా వుండాలనీ, సూచనలు పాటించాలనీ, లేకపోతే హఠాత్తుగా జరిగే పరిణామాల కారణంగా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని జనరల్‌ అథారిటీ సూచించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com