నోబెల్ గ్రహీత వీఎస్ నైపాల్ కన్నుమూత
- August 11, 2018
సాహిత్యంలో నోబెల్ పురస్కారం అందుకున్న ప్రముఖ రచయిత వీఎస్ నైపాల్ కన్నుమూశారు. ఆయన కుటుంబం నుంచి అందిన సమాచారం ప్రకారం 85 ఏళ్ల వయసున్న నైపాల్ లండన్లో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
భారతీయ సంతతికి చెందిన నైపాల్ 1932లో ట్రినిడాడ్లో జన్మించారు. ట్రినిడాడ్లోనే పెరిగిన నైపాల్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశారు. రచనా రంగంలోకి రాక ముందు ఆయన బీబీసీ కోసం కూడా పనిచేశారు. ఆయన నవలల్లో 'ఎ బాండ్ ఇన్ ద రివర్', 'ఎ హౌస్ ఫర్ మిస్టర్ బిశ్వాస్' చాలా ప్రముఖమైనవి. నైపాల్కు 1971లో బుకర్ ప్రైజ్, 2001లో సాహిత్యంలో నోబెల్ పురస్కారం లభించాయి.
ఒకసారి ఆత్మహత్యాయత్నం కూడా చేశారు
"ఆయన తన జీవితాన్ని సృజనాత్మకంగా గడిపారు. ఆఖరి సమయంలో ఆయనకు ఇష్టమైనవారందరూ తనతోనే ఉన్నారు" అని నైపాల్ మరణం తర్వాత ఆయన భార్య తెలిపారు. 1950లో నైపాల్ ఒక ప్రభుత్వ స్కాలర్షిప్ గెలుచుకున్నారు. దీని ద్వారా ఆయనకు తను కోరుకున్న యూనివర్సిటీలో అడ్మిషన్ లభించి ఉండేది. కానీ ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చేరారు. విద్యార్థిగా ఉన్నప్పుడు డిప్రెషన్కు గురైన ఆయన ఒకసారి ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. ఆయన మొదటి పుస్తకం 'ద మిస్టిక్ మెసర్', 1951లో ప్రచురితమైంది. తర్వాత పదేళ్లకు ప్రచురితమైన ఆయన ప్రముఖ నవల 'ఎ హౌస్ ఫర్ మిస్టర్ బిశ్వాస్' రాయడానికి మూడేళ్లకు పైగానే పట్టింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







