హైదరాబాద్లో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరుల అరెస్ట్
- August 12, 2018
హైదరాబాద్: నగరంలో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. బాలాపూర్లోని షాయిన్నగర్లో ఎన్ఐఏ అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించి 20 మంది యువకులకు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. అయితే... గత నాలుగు రోజులుగా వీరిని విచారిస్తుండగా మహ్మద్ అబ్దుల్ బాసిత్, అబ్దుల్ ఖాదిర్ అనే యువకులకు ఐసిస్ తీవ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు గుర్తించి వారిని ఆదివారం అరెస్టు చేశారు. ఐసిస్ సిద్ధాంతాన్ని హైదరాబాద్లో కొనసాగించడానికి ఈ ఇద్దరు కీలక పాత్ర పోషించినట్లు ఎన్ఐఏ విచారణలో బయట పడింది. అంతేగాక అనేకమంది యువతను సైతం ఐసిస్లో చేరేలా ప్రేరేపించే విధంగా చేశారని విచారణలో తేలింది.
తాజా వార్తలు
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!
- కుటుంబ సభ్యుల పుట్టిన తేదీలతో.. Dh30 మిలియన్ల జాక్పాట్ కొట్టిన భారతీయ ప్రవాసి..!!
- కువైట్లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో నగదు చెల్లింపులపై కొత్త నిబంధనలు..!!







