హైదరాబాద్‌లో ఇద్దరు ఐసిస్‌ సానుభూతిపరుల అరెస్ట్‌

- August 12, 2018 , by Maagulf
హైదరాబాద్‌లో ఇద్దరు ఐసిస్‌ సానుభూతిపరుల అరెస్ట్‌

హైదరాబాద్: నగరంలో ఇద్దరు ఐసిస్‌ సానుభూతిపరులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. బాలాపూర్‌లోని షాయిన్‌నగర్‌లో ఎన్ఐఏ అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించి 20 మంది యువకులకు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. అయితే... గత నాలుగు రోజులుగా వీరిని విచారిస్తుండగా మహ్మద్‌ అబ్దుల్‌ బాసిత్‌, అబ్దుల్‌ ఖాదిర్‌ అనే యువకులకు ఐసిస్ తీవ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు గుర్తించి వారిని ఆదివారం అరెస్టు చేశారు. ఐసిస్ సిద్ధాంతాన్ని హైదరాబాద్‌లో కొనసాగించడానికి ఈ ఇద్దరు కీలక పాత్ర పోషించినట్లు ఎన్ఐఏ విచారణలో బయట పడింది. అంతేగాక అనేకమంది యువతను సైతం ఐసిస్‌లో చేరేలా ప్రేరేపించే విధంగా చేశారని విచారణలో తేలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com