జన్ ఆరోగ్య అభియాన్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన మోదీ
- August 14, 2018
దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య అభియాన్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం సందర్భంగా ఈ పథకాన్ని మోదీ ప్రకటించారు. సెప్టెంబర్ 25వ తేదీ (పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతి) నుంచి ఈ పథకం ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ పథకం ద్వారా పేదలందరికీ ఉచితంగా వైద్యసాయం అందిస్తామన్నారు.
తొలివిడతగా దేశంలోని 10 కోట్ల మందికి వర్తింపజేస్తామన్న ఆయన.. ఆరోగ్య భారత్ లక్ష్యంగా ఈ పథకం పనిచేస్తుందని అన్నారు. ఈ పథకం అమలు కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తామని.. అవసరమైన సిబ్బంది, సదుపాయాలు కల్పిస్తామని మోదీ చెప్పారు. గడిచిన రెండేళ్లలో 5 కోట్ల మంది దారిద్య్ర రేఖకు ఎగువకు చేరుకున్నారని మోదీ అన్నారు. స్వచ్ఛ భారత్ వల్ల దేశంలోని ఎంతో మంది చిన్నారుల ప్రాణాలు రక్షించామని, మూడు లక్షల మందికి స్వచ్ఛ భారత్ రక్షించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO ) తెలిపిందని గుర్తు చేశారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!