జన్ ఆరోగ్య అభియాన్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన మోదీ
- August 14, 2018
దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య అభియాన్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం సందర్భంగా ఈ పథకాన్ని మోదీ ప్రకటించారు. సెప్టెంబర్ 25వ తేదీ (పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతి) నుంచి ఈ పథకం ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ పథకం ద్వారా పేదలందరికీ ఉచితంగా వైద్యసాయం అందిస్తామన్నారు.
తొలివిడతగా దేశంలోని 10 కోట్ల మందికి వర్తింపజేస్తామన్న ఆయన.. ఆరోగ్య భారత్ లక్ష్యంగా ఈ పథకం పనిచేస్తుందని అన్నారు. ఈ పథకం అమలు కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తామని.. అవసరమైన సిబ్బంది, సదుపాయాలు కల్పిస్తామని మోదీ చెప్పారు. గడిచిన రెండేళ్లలో 5 కోట్ల మంది దారిద్య్ర రేఖకు ఎగువకు చేరుకున్నారని మోదీ అన్నారు. స్వచ్ఛ భారత్ వల్ల దేశంలోని ఎంతో మంది చిన్నారుల ప్రాణాలు రక్షించామని, మూడు లక్షల మందికి స్వచ్ఛ భారత్ రక్షించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO ) తెలిపిందని గుర్తు చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







