రేపు సాయంత్రం 5గంటలకు అటల్ జీ అంత్యక్రియలు
- August 16, 2018
ఢిల్లీ: ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బీజేపీ కార్యవర్గాలు తెలిపాయి. ఎయిమ్స్ నుంచి వాజ్ పేయి నివాసానికి పార్థీవ దేహాన్ని తరలించారు. రేపు ఉదయం 9 గంటలకు బీజేపీ కేంద్ర కార్యాలయానికి అటల్ బిహారీ వాజ్ పేయి పార్థీవ దేహాన్ని తరలిస్తారు.
అక్కడ మధ్యాహ్నం ఒంటి గంట వరకు సందర్శకులకు అనుమతి ఇస్తారు. సందర్శన అనంతరం మధ్యాహ్నం 1.30 నుంచి అటల్ జీ అంతిమ యాత్ర ప్రారంభం కానున్నట్లు తెలిపాయి. సాయంత్రం 5గంటలకు రాజ్ ఘాట్ దగ్గర యమునా నదీతీరంలో రాష్ట్రీయ స్మృతీ స్థల్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!