కేరళకు బహ్రెయిన్‌ ఫైనాన్స్‌ కంపెనీ డొనేషన్‌

- August 16, 2018 , by Maagulf
కేరళకు బహ్రెయిన్‌ ఫైనాన్స్‌ కంపెనీ డొనేషన్‌

బహ్రెయిన్‌ ఫైనాన్స్‌ కంపెనీ, 3.5 మిలియన్‌ (రూపాయలు) అంటే సుమారు 19,500 బహ్రెయినీ దినార్స్‌ని కేరళ చీఫ్‌ మినిస్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌కి డొనేట్‌ చేసింది. కేరళ ప్రస్తుతం ఎదుర్కొంటున్న వరదల పరిస్థితి నేపథ్యంలో, ముఖ్యమంత్రి సహాయ నిధికి బహ్రెయిన్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఈ డొనేషన్‌ చేయడం జరిగింది. బహ్రెయిన్‌ ఫైనాన్స్‌ కంపెనీ డెలిగేట్స్‌ పాన్సిలీ వార్కీ (జనరల్‌ మేనేజర్‌), దీపక్‌ నాయర్‌ (హెడ్‌ ఆఫ్‌ రిటైల్‌ సేల్స్‌), సోమనాథన్‌ (హెడ్‌ ఆఫ్‌ డీలింగ్స్‌) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేరళలో వరదల కారణంగా వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. పలువురు ప్రాణాలు కోల్పోయారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com