న్యూజెర్సీ:మరో సిక్కు వ్యక్తి హత్య
- August 17, 2018
న్యూయార్క్:న్యూజెర్సీలో సిక్కు కమ్యూనిటీకి చెందిన మరో వ్యక్తి హత్యకు గురయ్యాడు. మూడు వారాల్లోనే ముగ్గురు సిక్కు వ్యక్తులను అమెరికాలో హత్య చేశారు. టేర్లోక్ సింగ్ అనే వ్యక్తి గత ఆరు సంవత్సరాల నుంచి న్యూజెర్సీలో స్టోర్ను నడుపుతున్నాడు. అయితే గురువారం రాత్రి స్టోర్లోకి ప్రవేశించిన దుండగులు టేర్లోక్ను హత్య చేశారు. సింగ్ ఛాతీపై కత్తిపోట్లు ఉన్నాయి. రక్తపు మడుగులో పడి ఉన్న సింగ్ను చూసి స్టోర్ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. టేర్లోక్ భార్య పిల్లలు ఇండియాలోనే నివసిస్తున్నారు. ఆగస్టు 6న సాహిబ్ సింగ్(71) అనే వ్యక్తిని మార్నింగ్ వాక్లో దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. జులై 31న సుర్జిత్ మల్హీ(50)ను మీ దేశానికి వెళ్లిపో అని హింసిస్తూ హత్య చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







