కేరళ వరదలపై మోదీ సమీక్ష
- August 17, 2018
కొచ్చి:కేరళ రాష్ట్రంలో వెల్లువెత్తిన వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గవర్నర్ పి. సదాశివం, సీఎం పినరయి విజయన్, రెవెన్యూ శాఖ మంత్రి చంద్రశేఖరన్ లతో సమీక్షించారు. కొచ్చిలో భారీవర్షం కురుస్తుండటంతో వరదపీడిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి మోదీ ఏరియల్ సర్వే చేయలేక పోయారు. దీంతో నావల్ బేస్ లోనే ప్రధాని వరద పరిస్థితిని సమీక్షించారు. కల్లిసరి ప్రాంతంలో వరదనీటిలో చిక్కుకుపోయిన 60 మందిని సహాయ సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించారు. 50 మంది సభ్యులున్న నేవీ బృందం చెంగనూర్ చేరుకొని వరదసహాయపనులు చేపట్టింది. కేరళలో 1568 సహాయ శిబిరాల్లో రెండులక్షలమందికి ఆశ్రయం కల్పించామని సీఎం విజయన్ చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









