యు.ఏ.ఈ నుండి 2015కు ఎంపికైన "ప్రవాసిమిత్ర"లు

- December 15, 2015 , by Maagulf


యునైటెడ్‌ నేషన్స్‌ అంతర్జాతీయ మైగ్రెంట్స్‌ డే సందర్భంగా డిసెంబర్‌ 18న ఐదుగురికి 'ప్రవాసి మిత్ర' పురస్కారాలను అందించనున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 18న 'మైగ్రెంట్స్‌ డే'ను నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 'మైగ్రెంట్స్‌' హక్కుల కోసం పోరాడుతున్న, సహకారం అందిస్తున్నవారికి ఈ అరుదైన గుర్తింపును అందజేయడం జరుగుతోంది. 1990 డిసెంబర్‌ 18న యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీ, మైగ్రెంట్‌ వర్కర్స్‌ మరియు వారి కుటుంబ సభ్యుల రక్షణ, మరియు హక్కుల కోసం అంతర్జాతీయ స్థాయిలో వేదికను ఏర్పాటు చేసింది. మైగ్రెంట్స్‌ రైట్స్‌ కౌన్సిల్‌ (మెంబర్‌ ఇన్‌ మైగ్రెంట్‌ ఫోరమ్‌ ఇన్‌ ఏసియా) అవార్డుల సెలక్షన్‌ కమిటీ ఐదుగురు వ్యక్తులను 'ప్రవాసి మిత్ర 2015' అవార్డుల కోసం ఎంపిక చేసింది. 
అవార్డు విజేతలు 
1. గిరీష్‌ పంత్‌, దుబాయ్‌, యూఏఈ 
2. గంగాధర్‌ గడ్డమ్‌, దుబాయ్‌, యూఏఈ 
3. శరత్‌ యలమర్తి, షార్జా, 
4. శాంతి ప్రియ, మలేసియా 
5. రామ్‌రెడ్డి ఎలా, సింగపూర్‌. 
సుందరయ్య విజ్ఞాన కేంద్రం, భాగ్‌లింగంపల్లి, హైద్రాబాద్‌లో ఈ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు డిసెంబర్‌ 18న ఈ అవార్డుల ప్రధానోత్సవాన్ని నిర్వహించనున్నారు. 

మాగల్ఫ్.కామ్ తరుపున అవార్డు గ్రహితులకు శుభాకాంక్షలు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com