తాలిబన్ల నిర్బంధంలో 100మంది ప్రయాణికులు
- August 20, 2018
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్లోని ఉత్తర ప్రాంతంలో 100మందిని తాలిబన్లు నిర్బంధించినట్లు అధికారులు తెలిపారు. వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈద్ అల్ అదా రోజున తాలిబన్లతో కాల్పుల విరమణ కోసం అధ్యక్షుడు అష్రఫ్ ఘానీ పిలుపున్విడాన్ని వ్యతిరేకిస్తూ తాలిబన్లు ఈ ఘాతుకానికి పూనుకున్నట్లు తెలుస్తోంది. ఖుండాజ్ ప్రాంతానికి చెందిన కౌన్సిల్ అధికారి మొహమ్మద్ యుసుఫ్ ఆయుబి మాట్లాడుతూ సోమవారం ఖాన్ అబాడ్ జిల్లాలోని మూడు బస్సులను ఆపి అందులోని ప్రయాణికులను అపహరించినట్లు తెలిపారు. టాక్తార్ ప్రాంతానికి చెందిన వారు కాబూల్కు వెళ్లేందుకు ఆబస్సులలో ప్రయాణిస్తున్నారని తెలిపారు. అయితే దీనిపై తాలిబన్లు ఇంతవరకు స్పందించలేదు. అయితే ఆప్రాంతమంతా తాలిబన్ల నియంత్రణలోనే ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









