ఇండియా:స్వల్ప జోరందుకున్న రూపాయి
- August 20, 2018ముంబయి:అంతర్జాతీయ వాణిజ్య భయాలు, టర్కీ లీరా పతనంతో జీవనకాల కనిష్ఠానికి చేరుకున్న రూపాయి ఎట్టకేలకు కోలుకుంది. డాలరుతో రూపాయి విలువ సోమవారం 33 పైసలు కోలుకుని 69.82కి చేరింది. ఒక్కరోజులో ఈ స్థాయిలో రూపాయి విలువ పెరగడం ఏడు వారాల్లో ఇదే గరిష్ఠం. అంతర్జాతీయ పరిణామాలకు తోడు వాణిజ్య చర్చలు జరిపేందుకు చైనా ప్రతినిధులు అమెరికాకు వెళ్తారన్న సంకేతాలు రూపాయి బలపడడానికి కారణమయ్యాయి. దీనికి తోడు ద్రవ్యోల్బణం తగ్గడం మరో కారణం. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గత వారంలో రూపాయి విలువ భారీగా పతనమైన సంగతి తెలిసిందే. టర్కీ ప్రభావంతో జీవన కాల కనిష్ఠమైన రూ.70.40కు చేరుకుంది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ