ఇండియా:స్వల్ప జోరందుకున్న రూపాయి
- August 20, 2018
ముంబయి:అంతర్జాతీయ వాణిజ్య భయాలు, టర్కీ లీరా పతనంతో జీవనకాల కనిష్ఠానికి చేరుకున్న రూపాయి ఎట్టకేలకు కోలుకుంది. డాలరుతో రూపాయి విలువ సోమవారం 33 పైసలు కోలుకుని 69.82కి చేరింది. ఒక్కరోజులో ఈ స్థాయిలో రూపాయి విలువ పెరగడం ఏడు వారాల్లో ఇదే గరిష్ఠం. అంతర్జాతీయ పరిణామాలకు తోడు వాణిజ్య చర్చలు జరిపేందుకు చైనా ప్రతినిధులు అమెరికాకు వెళ్తారన్న సంకేతాలు రూపాయి బలపడడానికి కారణమయ్యాయి. దీనికి తోడు ద్రవ్యోల్బణం తగ్గడం మరో కారణం. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గత వారంలో రూపాయి విలువ భారీగా పతనమైన సంగతి తెలిసిందే. టర్కీ ప్రభావంతో జీవన కాల కనిష్ఠమైన రూ.70.40కు చేరుకుంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









