ఇండియా:స్వల్ప జోరందుకున్న రూపాయి
- August 20, 2018
ముంబయి:అంతర్జాతీయ వాణిజ్య భయాలు, టర్కీ లీరా పతనంతో జీవనకాల కనిష్ఠానికి చేరుకున్న రూపాయి ఎట్టకేలకు కోలుకుంది. డాలరుతో రూపాయి విలువ సోమవారం 33 పైసలు కోలుకుని 69.82కి చేరింది. ఒక్కరోజులో ఈ స్థాయిలో రూపాయి విలువ పెరగడం ఏడు వారాల్లో ఇదే గరిష్ఠం. అంతర్జాతీయ పరిణామాలకు తోడు వాణిజ్య చర్చలు జరిపేందుకు చైనా ప్రతినిధులు అమెరికాకు వెళ్తారన్న సంకేతాలు రూపాయి బలపడడానికి కారణమయ్యాయి. దీనికి తోడు ద్రవ్యోల్బణం తగ్గడం మరో కారణం. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గత వారంలో రూపాయి విలువ భారీగా పతనమైన సంగతి తెలిసిందే. టర్కీ ప్రభావంతో జీవన కాల కనిష్ఠమైన రూ.70.40కు చేరుకుంది.
తాజా వార్తలు
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!







