యూఏఈ సాయాన్ని తిరస్కరించనున్న ఇండియా
- August 22, 2018
యూఏఈ:వరదల కారణంగా విలవిల్లాడుతున్న కేరళను ఆదుకునేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ముందుకు రాగా, ఆ సాయాన్ని భారత ప్రభుత్వం తిరస్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 100 మిలియన్ డాలర్స్ (సుమారు 700 కోట్ల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని కేరళకు ప్రకటించింది. అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ సుప్రీమ్ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, భారత ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడి ఈ సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధృవీకరించారు కూడా. యూఏఈలో నివసిస్తున్న భారతీయుల్లో 80 శాతం మంది కేరళీయులే. ఇదిలా ఉంటే, మాల్దీవ్స్ ప్రభుత్వం 50,000 డాలర్లను కేరళ వరద బాధితుల కోసం సహాయంగా ప్రకటించింది. ఐక్య రాజ్య సమితి సైతం కేరళ వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొస్తోంది. అయితే విదేశాల నుంచి అందే సాయాన్ని తిరస్కరించాలని భారత ప్రభుత్వం భావిస్తుండడం గమనార్హం.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







