యూఏఈ సాయాన్ని తిరస్కరించనున్న ఇండియా
- August 22, 2018
యూఏఈ:వరదల కారణంగా విలవిల్లాడుతున్న కేరళను ఆదుకునేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ముందుకు రాగా, ఆ సాయాన్ని భారత ప్రభుత్వం తిరస్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 100 మిలియన్ డాలర్స్ (సుమారు 700 కోట్ల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని కేరళకు ప్రకటించింది. అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ సుప్రీమ్ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, భారత ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడి ఈ సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధృవీకరించారు కూడా. యూఏఈలో నివసిస్తున్న భారతీయుల్లో 80 శాతం మంది కేరళీయులే. ఇదిలా ఉంటే, మాల్దీవ్స్ ప్రభుత్వం 50,000 డాలర్లను కేరళ వరద బాధితుల కోసం సహాయంగా ప్రకటించింది. ఐక్య రాజ్య సమితి సైతం కేరళ వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొస్తోంది. అయితే విదేశాల నుంచి అందే సాయాన్ని తిరస్కరించాలని భారత ప్రభుత్వం భావిస్తుండడం గమనార్హం.
తాజా వార్తలు
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!







