రషిదియా - షార్జాలను కలుపుతూ కొత్త బస్ రూట్
- August 23, 2018
దుబాయ్ నుంచి షార్జా మధ్య ప్రయాణించేవారికి రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) గుడ్ న్యూస్ చెప్పింది. ఇ311 పేరుతో కొత్త రోజువారీ బస్ రూట్ని ఈ రెండు ఎమిరేట్స్ మధ్య ప్రకటించింది. 30 నిమిషాలకు ఓ బస్ ప్రయాణించేలా మొత్తం ఆరు బస్లను ఇందుకోసం కేటాయించింది ఆర్టిఎ. దుబాయ్లోని రష్దియా మెట్రో స్టేషన్ని షార్జాలోని అల్ జుబైల్ బస్ స్టేషన్ని ఈ బస్ రూట్ కలుపుతుందని ఆర్టిఎ డైరెక్టర్ ఫర్ ప్లానింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ మొహమ్మద్ అబుబాకర్ అల్ హాషిమి చెప్పారు. రషిదియా మెట్రో స్టేషన్ నుంచి షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డు మీదుగా షార్జాలోకి ఎంటర్ అవుతుంది. ఈ రూట్లో నిత్యం ప్రయాణించేవారికి ఈ బస్లు ఎంతగానో ఉపకరిస్తాయని అల్ హాషిమి చెప్పారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







