రషిదియా - షార్జాలను కలుపుతూ కొత్త బస్ రూట్
- August 23, 2018
దుబాయ్ నుంచి షార్జా మధ్య ప్రయాణించేవారికి రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) గుడ్ న్యూస్ చెప్పింది. ఇ311 పేరుతో కొత్త రోజువారీ బస్ రూట్ని ఈ రెండు ఎమిరేట్స్ మధ్య ప్రకటించింది. 30 నిమిషాలకు ఓ బస్ ప్రయాణించేలా మొత్తం ఆరు బస్లను ఇందుకోసం కేటాయించింది ఆర్టిఎ. దుబాయ్లోని రష్దియా మెట్రో స్టేషన్ని షార్జాలోని అల్ జుబైల్ బస్ స్టేషన్ని ఈ బస్ రూట్ కలుపుతుందని ఆర్టిఎ డైరెక్టర్ ఫర్ ప్లానింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ మొహమ్మద్ అబుబాకర్ అల్ హాషిమి చెప్పారు. రషిదియా మెట్రో స్టేషన్ నుంచి షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డు మీదుగా షార్జాలోకి ఎంటర్ అవుతుంది. ఈ రూట్లో నిత్యం ప్రయాణించేవారికి ఈ బస్లు ఎంతగానో ఉపకరిస్తాయని అల్ హాషిమి చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







