రషిదియా - షార్జాలను కలుపుతూ కొత్త బస్ రూట్
- August 23, 2018
దుబాయ్ నుంచి షార్జా మధ్య ప్రయాణించేవారికి రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) గుడ్ న్యూస్ చెప్పింది. ఇ311 పేరుతో కొత్త రోజువారీ బస్ రూట్ని ఈ రెండు ఎమిరేట్స్ మధ్య ప్రకటించింది. 30 నిమిషాలకు ఓ బస్ ప్రయాణించేలా మొత్తం ఆరు బస్లను ఇందుకోసం కేటాయించింది ఆర్టిఎ. దుబాయ్లోని రష్దియా మెట్రో స్టేషన్ని షార్జాలోని అల్ జుబైల్ బస్ స్టేషన్ని ఈ బస్ రూట్ కలుపుతుందని ఆర్టిఎ డైరెక్టర్ ఫర్ ప్లానింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ మొహమ్మద్ అబుబాకర్ అల్ హాషిమి చెప్పారు. రషిదియా మెట్రో స్టేషన్ నుంచి షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డు మీదుగా షార్జాలోకి ఎంటర్ అవుతుంది. ఈ రూట్లో నిత్యం ప్రయాణించేవారికి ఈ బస్లు ఎంతగానో ఉపకరిస్తాయని అల్ హాషిమి చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







